18 Pages Movie
-
ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్
‘‘ఇది వరకు మనం సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే రీచ్ ఉండేది. కానీ దక్షిణాది సినిమాలు ఉత్తరాదికి వెళ్లేందుకు ‘బాహుబలి’తో బాటలు వేసిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ‘పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార’ సినిమాలు పాన్ ఇండియా వెళ్లడం హ్యాపీ. మన చిత్రాలు దేశమంతా చూస్తుండటం మనకు గర్వకారణం’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 విడుదలకానుంది. గోపీసుందర్, సూర్యప్రతాప్, వివేక్ కూచిభొట్ల, బన్ని వాసు, సుకుమార్, అనుపమ, అల్లు అర్జున్, నిఖిల్ ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్గారు లేకుంటే నా ఈ జీవితం, ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా నాన్నకి(అల్లు అరవింద్) సొంత ఓటీటీ ఉంది. ‘18 పేజెస్’ విడుదల ఆలస్యం అవుతుండటంతో ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా మంది చెప్పినా థియేటర్లోనే విడుదల చేస్తున్న ఆయనకి థ్యాంక్స్. ‘18 పేజెస్’ కి గోపీ సుందర్ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్కి థ్యాంక్స్. ‘హ్యాపీడేస్’ నుంచి నిఖిల్ గ్రాఫ్ చూస్తున్నాను.. చాలా మంచి కథలు ఎంచుకుంటున్నాడు. ఎలా అని ఓ సారి అడిగితే బుక్స్ బాగా చదువుతాడట. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఒక యాక్టర్కి కావాల్సిన అర్హత ఏంటంటే పుస్తకాలు చదవడం.. అది తనలో చాలా ఉంది. ‘18 పేజెస్’ కి యూనిట్ పెట్టిన కష్టం మీ మనసులను టచ్ చేస్తుంది. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘18 పేజెస్’ వంటి అద్భుతమైన కథని సుకుమార్ రాశాడు. ఇది గీతా ఆర్ట్స్లో తీస్తే బాగుంటుందని బన్ని వాసుకి కథ ఇచ్చి, మా గీతా ఆర్ట్స్లో సినిమా తీయించినందుకు తనకి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అవుదామని ‘జగడం’ టైమ్లో అనుకున్నా. ‘ఆర్య 2’ తీస్తున్నప్పుడు నిఖిల్కి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ‘హ్యాపీడేస్’ సినిమా చూసినప్పుడే తను సక్సెస్ అవుతాడనిపించి, ఆ అడ్వాన్స్ ఇచ్చాను. ‘18 పేజెస్’ సక్సెస్ క్రెడిట్ సూర్యప్రతాప్దే. ‘పుష్ప 2’ ఐదు రోజులు షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్, సుకుమార్లు లేకపోతే బన్ని వాసు అనే వాడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు సినిమాలు తీసుకెళ్లేలా బాటలు వేసిన దర్శకులు రాజమౌళి సర్, సుకుమార్ సర్కి థ్యాంక్స్. ‘18 పేజెస్’ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది’’ అన్నారు నిఖిల్. ఈ వేడుకలో నిర్మాతలు వై.రవిశంకర్, ‘జెమిని’ కిరణ్, ఎస్కేఎన్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాల్గొన్నారు. -
'18 పేజెస్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..!
క్రిస్మస్ సందర్భంగా ఈవారం థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కట్టాయి. సినీ ప్రేక్షకులకు విందు పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ 'అవతార్-2' థియేటర్లలో అలరిస్తోంది. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది) రవితేజ 'ధమాకా': మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. 18 పేజెస్ లవ్ స్టోరీ: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ప్రేక్షకులను అలరించనుంది. 'లాఠీ'తో వస్తున్న విశాల్: విశాల్ తాజా చిత్రం 'లాఠీ'. సునయన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు ముఖ్య పాత్ర పోషించారు. ఆర్. వినోద్ కుమార్ను దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నయన్తో కనెక్ట్: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ‘సర్కస్’ రణ్వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, బాద్షా, లీజో జార్జ్ సంగీతమందించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. ఓటీటీకీ రెడీ అయిన చిత్రాలు ♦ ఆహా ►'మసూద'- డిసెంబర్ 21 ♦ నెట్ఫ్లిక్స్ ► జయ జయ జయ జయహే-డిసెంబర్ 22 ♦ వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ ఎమిలి ఇన్ పారిస్ - డిసెంబరు 21 ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ - డిసెంబరు 22 గ్లాస్ ఆనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ - డిసెంబరు 23 ద ఫాబ్యూలస్ - డిసెంబరు 23 ద టీచర్ - డిసెంబరు 23 అమెజాన్ ప్రైమ్ టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్- డిసెంబరు 21 జీ5 షడ్యంత్ర -డిసెంబరు 18 పిచర్స్ -డిసెంబరు 23 డిస్నీ+హాట్స్టార్ బిగ్బెట్ - డిసెంబరు 21 సోనీ లివ్ కాఠ్మాండు కనెక్షన్ - డిసెంబరు 23 తారా వర్సెస్ బిలాల్- డిసెంబరు 23 -
'18 పేజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యడు, సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. నిఖిల్, అనుపమల కెమిస్ట్రీ మరింత హైలైట్గా నిలుస్తుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 19న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బన్నీ రాకతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. Mana andariki Nachinodu Manodu Sarrainodu Vastunadu.. @alluarjun 🔥🤩#AAFor18Pages 2 Days to go ❤️@GeethaArts @actor_Nikhil #18pages pic.twitter.com/lYkaktFqBL — Allu Arjun TFC™ (@AlluArjunTFC) December 17, 2022 ANDD!! The much awaited update is here!🔥 𝐈𝐂𝐎𝐍 𝐒𝐓𝐀𝐑 @alluarjun garu to grace the grand pre-release event of #18Pages on 𝐃𝐄𝐂 𝟏𝟗 !🤩#AAFor18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @adityamusic @shreyasgroup pic.twitter.com/EsLjKusjk2 — Sukumar Writings (@SukumarWritings) December 16, 2022 -
'18 పేజెస్' ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ప్రేమించడానికి కారణం ఉండకూడదు.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్ ట్రైలర్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. యూత్లో బాగా బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అద్భుతమైన విజువల్స్తో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు ట్రైలర్లో. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలోని ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్లో చూపించారు. ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు’ వంటి డైలాగ్స్తో ట్రైలర్ను ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదల కానుంది. -
'18 పేజెస్' అప్డేట్.. 'నీ వల్ల ఓ పిల్ల' అంటున్నా నిఖిల్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాట ద్వారా కొత్త రచయిత తిరుపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జీఏ పిక్చర్స్. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, పోస్టర్స్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. యూత్లో బాగా బజ్ క్రియేట్ ఈ చిత్ర ట్రైలర్ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఇవాళ ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
నిఖిల్, అనుపమల '18 పేజెస్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, "కుమారి 21ఎఫ్'' డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. యూత్లో బాగా బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం ట్రైలర్ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజిస్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
నిఖిల్, అనుపమ ‘18 పేజిస్’ నుంచి మరో మేలోడి సాంగ్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. చదవండి: అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దామంటూ సుకుమార్ నాతో చెప్పడంతో ‘18 పేజెస్ తీశాం. ఇది మామూలు ప్రేమకథ కాదు’’ అన్నారు. ‘‘జానపద పాటలు రాసే తిరుపతిగారిని ఈ సినిమాతో పాటల రచయితగా లాంచ్ చేస్తున్నాం’’ అన్నారు బన్నీ వాసు. ‘‘గీతా ఆర్ట్స్లో డైరెక్షన్ చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు సూర్యప్రతాప్ పల్నాటి. -
అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యమలో ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన..’ పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. శ్రీమణి రాసిన సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ పాటను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘అనుపమ గురించి మాట్లాడకుండ ఉండలేను. ఆమెను చూస్తే నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి తను. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్పరేంట్గా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే అనుమప అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. హీరో నిఖిల్ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ చాలా అంకిత భావంతో పనిచేస్తాడంటూ ప్రశంసించారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్స్టోరీ కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '18 పేజీస్'.. క్రేజీ అప్డేట్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను డిసెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారికి ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్తో పాటు 'నన్నయ్య రాసిన', 'కొంచెం టైం ఇవ్వు పిల్ల' అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం సిధ్ శ్రీరామ్ పాడిన పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇదివరకే రిలీజైన రెండుపాటలకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. కార్తికేయ మూవీతో భారీ హిట్ అందుకున్న నిఖిల్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Get ready to fall in love with the melodious #YedurangulaVaana song from #18Pages 💕 Full song out on Dec 11th! A @GopiSundarOffl Musical 🎼@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @sidsriram @ShreeLyricist @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/Xt4xciKoTI — 18Pages (@18PagesMovie) December 9, 2022 -
రవితేజ, నిఖిల్తో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న నయన్!
క్రిస్మస్ పండక్కి సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో..ఈ క్రిస్మస్ ను బెస్ట్ అప్సన్ గా ఎంచుకున్నాయి.మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో రంగంలో దిగుతున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీలా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాటతో కూడా ఆకట్టుకున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వరన్ నటించిన కార్తికేయా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరిగింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ,నిఖిల్ తమ సినిమాతో పండక్కి రాబోతుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీతో రంగంలోకి దిగుతుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్ విడుదల చేశారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీలో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియన్స్ కు సినిమా మొదలయినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వరన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుందో చూడాలి. -
'పిల్ల కొంచెం టైం ఇవ్వు' అంటున్న నిఖిల్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజీస్'. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి "టైం ఇవ్వు పిల్ల" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించారు. ప్రతీ ఒక్కరి లైఫ్లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు" అనే పాటను శింబు ఆలపించారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలై టీజర్, 'నన్నయ్య రాసిన' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. -
తమిళ స్టార్ శింబు నోట మరో తెలుగు పాట
తమిళ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని తనకంటూ కొంతమంది అభిమానులను సాధించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా శింబు లో మంచి సింగర్ కూడా ఉన్నాడు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం పాట పాడనున్నాడు శింబు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న ‘18పేజిస్’ ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేసారు. ఆ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెరగడం వలన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిత్రబృందం. అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో శింబు తో ఈ చిత్రంలో పాట పాడించనున్నారట. ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా కి ‘డైమెండ్ గర్ల్’, మంచు మనోజ్ పోటుగాడికి కి ‘బుజ్జి పిల్ల’.. యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి ‘బుల్లెట్ సాంగ్’ ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు’ అనే పాటను పాడనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23 విడుదల కానుంది. -
18 Pages: ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే..’ ఆకట్టుకుంటున్న క్లాసీ మెలోడీ
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగేనా నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చేనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా .. అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. -
'18 పేజెస్' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ విడుదల
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక కార్తికేయ-2 హిట్ తర్వాత నిఖిల్, అనుపమ కలిసి నటించిన సినిమా కావడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన గతంలోనూ కుమారి 21 ఎఫ్ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం డిసెంబర్23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి నన్నయ్య రాసిన అనే లిరికల్ వీడియోను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
చివరి పేజీ షురూ
నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి జీఏ2 పిక్చర్స్పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ ‘18 పేజెస్’ చివరి పేజీ (షెడ్యూల్) ప్రారంభమైంది. ‘‘కార్తికేయ 2’ విడుదల, ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం కొంచెం విరామం తీసుకున్న తర్వాత నిఖిల్ తాజాగా ‘18 పేజెస్’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. డిసెంబర్ 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
18 పేజేస్ చివరి షెడ్యూల్లో పాల్గొన్న నిఖిల్.. ఫోటో వైరల్
నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్టు కొట్టిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా ఆయన కథను అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ 18 పేజెస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి GA2 పిక్చర్స్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కాగా, నిఖిల్ ఈ షూటింగులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
‘18 పేజెస్’ నుంచి క్రేజీ అప్డేట్, ఆకట్టుకుంటున్న అనుపమ లుక్
యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో అనుపమ నందిని పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీలోని నందిని పాత్రకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అనుపమ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. Here it is!! 🤩 Introducing the beautiful @anupamahere as #𝑵𝒂𝒏𝒅𝒊𝒏𝒊 from #18Pages 📜🦋#NandiniFirstLook ▶️ https://t.co/edXy4PnW3S@aryasukku #BunnyVas @actor_Nikhil @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic — Geetha Arts (@GeethaArts) September 10, 2021 ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో కెరియర్లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు.. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది” అని నిఖిల్ కళ్లకు గంతల్లా పేపర్ కట్టి దానిపై రాసింది. -
అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్, షూటింగ్ టైంలో అలా..
యంగ్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నిఖిల్ బర్త్డే సందర్భంగా జూన్ 1న విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్లుక్ ఎంత ఫ్రెష్గా ఉందో అందరికి తెలిసిందే. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది నిఖిల్ మొహంపై పేపర్ పెట్టి రాసిన ఫస్ట్లుక్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫస్ట్లుక్ మేకింగ్ని బయటపెట్టాడు హీరో నిఖిల్. షూటింగ్ సమయంలో అనుపమ చేసిన అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. యూనిట్ అంతా షూటింగ్ కోసం సీరియస్గా వర్క్ చేస్తుంటే.. అనుపమ మాత్రం సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోని నిఖిల్ ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక నిఖిల్ పోస్ట్పై అనుపమ స్పదించింది.మొత్తానికి ఆ విషయాన్ని నువ్ ఒప్పుకున్నావ్ అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్పై రాజమౌళి సంచలన నిర్ణయం! -
ప్రేమ సన్నివేశాల్లో నిఖిల్ ఎవరిని ఊహించుకుంటాడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం '18 పేజీస్'తో పాటు 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. నేడు(జూన్1) అతడి బర్త్డేను పురస్కరించుకుని 18 పేజీస్ ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కళ్లకు గంతలు కట్టి దాని మీద ప్రేమ వాక్యాలు రాస్తోంది. తన ఫీలింగ్ను మాటల్లో కన్నా అక్షరాల్లో చెప్తేనే బాగుంటందని అంటోంది. ఈ పోస్టర్ చూస్తేనే ఇదో పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్తో లవ్సీన్లలో నటించడంపై స్పందించాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్తో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన భార్య డాక్టర్ పల్లవిని ఊహించుకున్నట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత లవ్ సీన్లలో నటించడం చాలా తేలికైందని చెప్పాడు. ఇన్నాళ్లూ తనను లవర్బాయ్గా అంగీకరిస్తారో లేదోనన్న భయంతో ఇంతకాలం పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా '18 పేజీస్' సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. 'కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తుండగా గోపీసుందర్ సంగీతం అందించారు. చదవండి: HBD Nikhil : ఆసక్తికరంగా18 pages ఫస్ట్ లుక్ పోస్టర్ మనల్ని ఎవరూ కాపాడలేరు: నిఖిల్ ఎమోషనల్ -
నిఖిల్ ఇంటికి ‘18 పేజెస్’స్పెషల్ గిఫ్ట్.. షాకైన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ బర్త్డే నేడు (జూన్ 1). ఈ సందర్భంగా ఆయనకు ‘18 పేజెస్’స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమే ‘18 పేజెస్’. కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్ బర్త్డే సందర్భంగా ఫస్ట్లుక్ విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా ఆయనకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. నిఖిల్ ఇంటికి ఓ పెద్ద కేకును, బొకే పంపించి బర్త్డే విషెస్ చెప్పింది. ‘18 పేజెస్’ఫస్ట్లుక్ పోస్టర్ ఉన్న ఆ కేకు చూసి నిఖిల్ షాకయ్యాడు. తనకు ఇంతమంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్, సుకుమార్, డైరెక్టర్ సూర్యప్రతాప్కి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే తనకు పంపించిన కేకును కట్ చేయకుండా మెమోరీగా దాచుకున్నాడు. A small surprise to @actor_Nikhil from Team #18Pages 🎉 #HappyBirthdayNikhil 🥳 One more brand new poster coming your way! 🤩#AlluAravind @aryasukku @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli #BunnyVas @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/llvMYlWqQl — Geetha Arts (@GeethaArts) June 1, 2021 చదవండి: టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీపై కర్ణి సేనా ఆగ్రహం