పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు టీనేజి యువతిపై అత్యాచారం చేసి, తర్వాత ఆమె గొంతుకోసేశాడు!! మాల్డా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అభయ్ మోండల్ (27) అనే వ్యక్తి సైకిల్ కొనిస్తానని చెప్పి ఓ అమ్మాయిని ఆమె ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసేశాడు. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యి, ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఎలాగోలా రోడ్డుమీదకు వచ్చి ఓ టీస్టాల్ వద్దకు చేరుకుంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే మాల్డా మెడికల్ కాలేజికి తరలించారు. జిల్లా ఎస్పీ కళ్యాణ్ ముఖర్జీ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కృష్ణేందు నారాయణ్ చౌదరి వెంటనే ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. మోండల్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచారం చేసి.. గొంతుకోసిన దుర్మార్గుడు
Published Sun, Dec 22 2013 8:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement