మిస్ అయిన జస్ట్ డయల్ | Just Dial Posts Lowest-Ever Margin In Q1, Shares Slump | Sakshi
Sakshi News home page

మిస్ అయిన జస్ట్ డయల్

Published Wed, Aug 17 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

మిస్ అయిన జస్ట్ డయల్

ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి  త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను  నమోదు చేసింది.  క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది.  మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది.  మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది.  ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా  పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు  3శాతం నష్టాల్లో ఉంది

ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో,  ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement