ప్రజాధనంతో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయద్దంటూ చైనా తమ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిషేధం విధించినట్లు చెప్పింది. ఐ ప్యాడ్లు, మాక్బుక్ల లాంటి ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్ల జాబితా నుంచి జూలై నెలలోనే తొలగించారు. జూన్ వరకు వీటిని కొనుగోలు చేసేవారు. ఈ నిషేధంతో చైనా మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలపై గణనీయంగా ప్రభావం పడనుంది.
అమెరికాకు చెందిన సిమాంటిక్ కార్పొరేషన్, రష్యాకు చెందిన కాస్పర్స్కీ ల్యాబ్ల నుంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయొద్దని చైనా ఇటీవలే ప్రభుత్వ శాఖలకు తెలిపింది. అలాగే, ప్రభుత్వ కొనుగోళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 8ను ఈ సంవత్సరం మే నెలలో మినహాయించారు. ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో ఐఫోన్ మాత్రం నిషేధం నుంచి తప్పించుకుంది.
అధికారులూ.. యాపిల్ ఉత్పత్తులు కొనద్దు!
Published Thu, Aug 7 2014 12:16 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- నేర చట్టాలు సరికొత్తగా..
- నెల్లిమర్ల జూట్మిల్ మళ్లీ మూత
- ఆక్వా రైతుల ఉద్యమ బాట
- వీర జవాన్లకు అశ్రు నివాళి
- రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
- రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి
- మాయమయింది మళ్లీ వచ్చింది
- నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
- నేనంటే లెక్కలేదా..?
- ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి
Advertisement