![యువతి అదృశ్యం - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/3/71450567015_625x300.jpg.webp?itok=8-oWTRYi)
శంషాబాద్ రూరల్ : మండలంలోని ననాజీపూర్లో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం మేరకు.. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్కు చెందిన వీరస్వామి కుటుంబం కొంత కాలంగా ననాజీపూర్లో నివాసముంటుంది. వీరాస్వామి కుమార్తె ప్రవళిక (18) ఈ నెల 15న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తె లిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు శనివారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీ తెలిస్తే 08413 - 2220333 నంబరు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.