ఇందూరు, న్యూస్లైన్ : ఓ మహనీ యుని విగ్రహం ఏ ర్పాటుకే జిల్లా కేం ద్రంలో స్థలం కరువైంది. మూడేళ్ల క్రితమే జిల్లాకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని మంజూరు చేసిం ది.అయితే ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ఇప్పటివరకు ఆవిష్కరణకు నో చుకో లేదు. విగ్రహ ఏ ర్పాటు కోసం విడుద ల చేసిన రూ. 4 లక్షల 25 వేలు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. 2011 నుంచి జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు జ్యోతిరావు పూలే విగ్ర హ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ని జామాబాద్ కార్పొరేషన్ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. కలెక్టర్లు బదిలీలపై వెళ్లిపోయారు గానీ అధికారులు ఇంత వరకు స్థలాన్ని చూపించలేక పోయారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు రెండేళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన రావడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వరప్రసాద్, క్రిస్టీనా జెడ్ చొంగ్తూలు జిల్లా కేంద్రంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే వారు బదిలీపై వెళ్లిపోయారు. శుక్రవారం జ్యోతిరావు పూలే 188వ జయంతిని నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ చౌరస్తాలో గల అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రద్యుమ్న హయాంలోనైనా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కావాలని దళిత సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూలే విగ్రహానికి స్థలం కరువు!
Published Fri, Apr 11 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Related news by tags
-
అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా రివ్యూ
టైటిల్: బడ్డీనటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులుదర్శకత్వం: శామ్ ఆంటోన్ నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజాసంగీతం : హిప్ హాప్ తమిళవిడుదల తేది: 02-08-2024టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే, ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా..? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం.కథ...ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? పల్లవి కిడ్నాప్కి.. హాంగ్ కాంగ్లో ఉన్న డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)కి ఉన్న సంబంధం ఏంటి? టెడ్డీబేర్లో ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు పల్లవిని ఎలా రక్షించాడా..? లేదా..? అనేదే మిగతా కథఎలా ఉందంటే..?అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంతో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా అదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా త్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకొని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు.అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి (గాయత్రి భరద్వాజ్) కోమాలోకి వెళ్లడం.. అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే, టెడ్డీ బేర్కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడుతారు. కానీ, ఇందులో అలాంటివి ఏవీ జరగవు. పైగా సెల్పీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. అయితే చిన్ని పిల్లలకు కాస్త ఆసక్తిని కలిగించవచ్చు.సెకండాఫ్లో కథ అంతా హాంకాంగ్కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతిగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్గా అజ్మల్ ఎంట్రీ పవర్ ఫుల్గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సింపుల్గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్ అలీ, ముకేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఖరీదైన కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. త్వరలో నటుడు విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2012లో ఎంతో ఇష్టపడి రోల్స్రాయ్స్ ఖరీదైన కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవడం వల్ల లోకల్ టాక్స్ కట్టలేదనే ఆరోపణలను విజయ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. చైన్నె న్యాయస్థానం విజయ్కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. అలాంటిది విజయ్ తను ముచ్చటపడి కొనుక్కున ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ విజయ్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అని రోల్స్రాయ్స్ కారు ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర రూ.26 కోట్లు అని, అయితే ఇది నిర్ణయిత ధర కాదని పేర్కొన్నారు. అయితే అది విజయ్ కారా, కాదా అనే చర్చ జరుగుతోంది. -
ఉగాదికి వస్తున్నా
ఉగాదికి థియేటర్స్లో కలుద్దాం అంటున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి, మూవీని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదలను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే టైటిల్ను, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారనీ టాక్. ఈ సినిమాకు కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి. జాన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
గుండె ఒట్టు పెట్టుకున్నాదే...
‘అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘జిక్కీ’. రవితేజ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సె కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాలోని ‘జిక్కీ...’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.‘‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే... గట్టుదాటి గట్టిగానే కొట్టుకున్నదే... పట్టుపట్టి పిల్లా చెయ్యి పట్టుకున్నదే...’, ‘నా మనసే నీకే చిక్కి... దిగనందే మబ్బుల్ ఎక్కి... నీ బొమ్మే చెక్కి... రోజూ నిన్నే పూజించానే జిక్కీ...’ అనే లిరిక్స్తో ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో వనమాలి సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, రమ్య బెహరాపాడారు. -
ఇక షురూ
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ‘ఫౌజి’ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ చిత్రంలోని హీరోయిన్పాత్రకు మృణాల్ ఠాగూర్,పాకిస్తాన్ నటి సజల్ అలీని అనుకుంటున్నారనీ ప్రచారం జరుగుతోంది.ఈ నెల మూడో వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని, మూడుపాటల పని కూడా పూర్తయిందని ఆ మధ్య హను రాఘవపూడి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
Related News by category
-
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్లలో బేబీ బెర్త్లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్లకు బేబీ బెర్త్లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
వయనాడ్లో 100 ఇళ్లు కట్టిస్తాం : రాహుల్ గాంధీ
కేరళ వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచరియల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300లు దాటింది. దాదాపు 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బాధితుల్ని పరామర్శించేందుకు వయనాడ్లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భాంగా వియనాడ్ విషాదంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం తానెక్కడ చూడలేదన్న ఆయన..బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం.
Advertisement