Published
Wed, Apr 12 2017 4:36 AM
| Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. మంగళవారం పూలే జయంతి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేయడమే కాకుండా భావి తరాలకు పూలే మార్గం చూపారని కొనియాడారు. బడుగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పునరంకితమవుతున్నట్లు ప్రకటించారు.