- విదేశీ ప్రతినిధుల కితాబు
- జిల్లా అధికారులతో కలిసి వెల్టూర్ గ్రామ సందర్శన
సదాశివపేట: వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సెర్ప్, డీఆర్డీఏ, ఐకేపీ జిల్లా అధికారులు గురువారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సంఘాల సభ్యులతో మాట్లాడి సంఘం రికార్డులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 54 సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘం ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను స్థానిక సిబ్బంది, సమాఖ్య లీడర్లు వీరికి వివరించారు.
బ్యాంకుల ద్వార 47 సంఘాలకుగాను రూ.1,78,5500 బ్యాంకు రుణాలతోపాటు, శ్రీనిధి బ్యాంకు ద్వారా 29 స్వయం సంఘాల గ్రూపుల్లోని 135 మందికి రూ.15,65,440 బ్యాంకు రుణాలు ఇచ్చారని తెలిపారు. వీటితో తాము పాడిగేదెలు, మేకలు, గొర్రెల పెంపకం, కూరగాయలను పండించడం, అమ్మడం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం తదితరాలకు వినియోగించామన్నారు.
అనంతరం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ మండల సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియా నుంచి స్నేహాల్సోహేల్, ఇరాన్ ప్రతినిధి ఫతేమహ అబ్కారి, కేన్యా నుంచి వెన్నా మొకారి ఓంవారి, మాడగాస్కర్ నుంచి రకోటమాలాల మిరియా రబియారిసో, షేశేల్లీస్ నుంచి బెట్టి మరియాసోపా, టంజానియా నుంచి ప్రోన్సికో ఎలాయాస్, తైలాండ్ నుంచి డమరోగో జయంతోలతో పాటు రాషఫకేశ్వర్లతో మండల ఐకేపీ ఎపీఎం వెంకట్ పాల్గొన్నారు.
మహిళా సంఘాల పనితీరు భేష్
Published Fri, Sep 19 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Related news by tags
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్నెస్కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Standing Desk: నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలు!
నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్ సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్తో సమానం వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్ పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్్కలు పరిష్కారంగా మారిపోయాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.చలనం.. ఆలోచనల ఫలం..ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్్కకు డిమాండ్... ఈ స్టాండింగ్ డెస్్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్కు ముందుతో పోలిస్తే ఈ డెస్్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు. నిరి్వరామం ప్రమాదం... నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్్కపై ఫ్లాట్గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం అంత మంచిది కాదని స్పష్టం చేశారు.కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. ⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి. ⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను మెరుగుపరచవచ్చు. -
నేడే లక్ష రుణమాఫీ.. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఆన్లైన్లో రైతులతో మాట్లాడనున్నారు. కొన్ని గ్రామాల్లో గందరగోళం రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. -
రాష్ట్రంలో డీఏపీ కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు. జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
Related News by category
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగింపు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం. -
రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు శీతాకాల విడిదికి కోసం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలకడంతోపాటు, శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. సచివాలయంలో ఆమె డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది చేసే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ సమస్యలేవీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీవీఐపీల భద్రతకు ఉపయోగించే బ్లూబుక్ ఆధారంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. -
అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బుధవారం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన స్పీకర్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం ప్రసాద్కుమార్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం రేవంత్రెడ్డితో పాటు వివిధ పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని వెళతారు. ఆపై నూతన స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారపక్షం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ప్రసాద్కుమార్ నామినేషన్ పత్రాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అయితే స్పీకర్ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. గడ్డం ప్రసాద్కుమార్ పేరును కాంగ్రెస్ ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్తో కలిసి బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి గడ్డం ప్రసాద్కుమార్కు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. కాంగ్రెస్ నుంచి అందిన వినతి మేరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రసాద్కుమార్ నామినేషన్ పత్రాలపై కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్యలు సంతకాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తదితరులు జట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు ప్రసాద్ కుమార్ తరపున నామినేషన్ పత్రాలు అందజేశారు. తెలంగాణ తొలి శాసనసభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్గా పనిచేయగా, రెండో శాసనసభలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్రెడ్డి స్పీకర్గా వ్యవహరించారు. ప్రస్తుత మూడో శాసనసభలో దళిత సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఎన్నికయ్యారు.
Advertisement