కట్టారు.. మరిచారు!! | bus shelter turning useless | Sakshi
Sakshi News home page

కట్టారు.. మరిచారు!!

Published Sun, Apr 19 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

bus shelter turning useless

అక్కరకు రాని చుట్టము.. అన్నట్లు జిల్లాలోని ఊట్కూర్ మండలకేంద్రానికి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్.. పదిహేనేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్టీసీ అధికారుల నిర్లక్షం, ప్రజా ప్రతినిధుల అలసత్వంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణంతో ప్రయాణీకులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. అయితే గ్రామానికి అరకిలోమీటర్ దూరంగా నిర్మించడం కూడా ఈ బస్టాండ్ కు మరో శాపం.

రూ. 7.5 లక్షల వ్యయంతో తలపెట్టిన ఈ బస్టాండ్ నిర్మాణానికి నాటి మంత్రి, దివంగత ఎల్కోటి ఎల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.  పనులు పూర్తయినా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగలేదు. దీంతో ప్రభుత్వ వాహనాలను అక్కడ నిలపడంలేదు. ప్రస్తుతం ఆ ప్రాంగణం బొగ్గు బట్టీ కార్మికులకు ఆవాసంగా మారింది. పాతబస్టాండ్ వద్ద ప్రయాణీకులు ఉండేందుకు కనీసం షెల్టర్‌ను ఏర్పాటు చేసి కొత్త బస్టాండ్ మీదుగా బస్సులు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement