అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులోని 20 మంది ప్రయాణికులను కిందికి దించేశాడు. ప్రయాణికులందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. బస్సు తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
బస్సులో మంటలు..తప్పిన ప్రమాదం
Published Mon, Sep 26 2016 7:53 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నందిగామ: కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నందిగామ పోలీస్స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులోని 20 మంది ప్రయాణికులను కిందికి దించేశాడు. ప్రయాణికులందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. బస్సు తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులోని 20 మంది ప్రయాణికులను కిందికి దించేశాడు. ప్రయాణికులందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. బస్సు తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Related news by tags
-
విస్తరణవాదం కాదు.. అభివృద్ధి కావాలి: మోదీ
న్యూఢిల్లీ: విస్తరణవాదం కాదు... అభివృద్ధి కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా చైనాకు చురక అంటించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ అభివృద్ధికేనని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్చిన్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. వియత్నంలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరువురు ప్రధానమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాల్లో ఆరు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు చేశారు. మరో మూడు ఒప్పందాలను ఖరారు చేశారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఫామ్ మిన్చిన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. -
ట్వీట్ దుమారం..ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
ఢిల్లీ : ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. నిన్న అనురాగ్ ఠాగూర్ ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు. అంతేకాదు అందరు వినాల్సిన ప్రసంగం అంటూ మోదీ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.లోక్సభ సమావేశాలపై ప్రధాన సమస్యలపై అధికార, విపక్షాల మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా కులగణనపై కాంగ్రెస్తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకు పడ్డారు.ఈ సందర్భంగా సభలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతే ధీటుగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైన తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు. కులగణన బిల్లును లోక్సభలో అమోదింప జేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ తరుణంలో లోక్సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షనేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ.. ఠాకూర్ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని అన్నారు.‘యువనేత అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని తప్పకుండా వినాలి. వాస్తవాలు, హాస్యచతురతతో కూడిన ఆయన ప్రసంగం ఇండియా కూటమి దుర్మార్గపు రాజకీయాల్ని బహిర్ఘతం చేసింది’అని ట్విటర్లో పోస్ట్ చేశారు మోదీ. అయితే మోదీ ట్వీట్పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీకి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానించింది. STORY | Congress MP Charanjit Singh Channi submits notice to move privilege motion against PM for sharing expunged remarksREAD: https://t.co/0o8feagLlN pic.twitter.com/hNtsFKSWN8— Press Trust of India (@PTI_News) July 31, 2024మోదీపై ప్రివిలేజ్ మోషన్కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రధాని ట్వీట్ చేయడం,వాటిని ప్రచారం చేయడం సభను ధిక్కరించారని పేర్కొంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు.. భారత్ వైపు!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా భారత్ పరుగులు తీస్తోందని.. దీంతో ప్రపంచ స్థాయి దిగ్గజ ఇన్వెస్టర్లందరూ భారత్లో పెట్టుబడులకు ఉవి్వళ్లూరుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత కార్పొరేట్లు ఈ ‘వికసిత్ భారత్‘ ప్రస్థానంలో సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. బడ్జెట్ తదనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో ఏర్పాటు చేసిన ‘వికసిత్ భారత్ దిశగా పయనం’ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘నేడు ప్రపంచమంతా భారత్ వృద్ధితో పాటు మీ (పారిశ్రామిక వర్గాలు) వైపే చూస్తోంది. ప్రపంచ ప్రగతికి భారత్ మూల స్తంభంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో సైతం భారత్ పట్ల పూర్తి ఆశావాదం నెలకొంది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇదో సువర్ణావకాశం, దీన్ని మనం వదులుకోకూడదు’ అని మోదీ చెప్పారు. వృద్ధి జోరు.. ధరలకు కళ్లెం ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమనంతో పాటు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వృద్ధి జోరు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా భారత్ వృద్ధి, స్థిరత్వాలకు దిక్సూచిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు 8 శాతం జీడీపీ వృద్ధితో పురోగమిస్తోంది. దీన్ని ప్రకారం చూస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ప్రస్తుత ఐదో స్థానం నుంచి మూడో ర్యాంకుకు చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఈ ఘనతను తన మూడో విడత హయాంలోనే సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం, సంతృప్త స్థాయి విధానం, జీరో ఎఫెక్ట్–జీరో డిఫెక్ట్, ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత్ భారత్ ప్రతిజ్ఙ అనేవి నేషన్ ఫస్ట్ విషయంలో మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, వర్ధమాన రంగాల్లో ప్రపంచ శక్తిగా నిలిపేందుకు దేశీ పారిశ్రామిక రంగం ప్రభుత్వంతో పోటీ పడాలని చెప్పారు. ఉద్యోగ కల్పనపైనే బడ్జెట్లో దృష్టి... కోట్లాదిగా ఉద్యోగాలిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నామని మోదీ గుర్తు చేశారు. ఇండస్ట్రీ 4.0 ప్రమాణాల మేరకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. భారత్ 1.4 లక్షల స్టార్టప్లకు నిలయం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా వంటి స్కీమ్లతో 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలను మొదలుపెట్టారని చెప్పారు. 4 కోట్ల మంది యువతకు మేలు చేకూర్చేలా రూ.2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీని బడ్జెట్లో ప్రకటించామన్నారు. దేశంలోని 100 జిల్లాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉండే ఇన్వెస్ట్మెంట్ పార్కులను నెలకొల్పనున్నామని, ఈ 100 నగరాలు వికసిత్ భారత్లో నయా కేంద్రాలుగా ఆవిర్భవించనున్నట్లు ప్రధాని తెలిపారు. -
నల్లమల ‘మన్ కీ బాత్’.. చెంచులే చేయూత!
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమలలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక చెంచులు రక్షణగా ఉంటున్నారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న వారు ఇక్కడి చెట్లు, వన్యప్రాణులు, సహజ సిద్ధమైన జలధారల పట్ల ఎంతో మమకారంగా ఉంటారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ సిబ్బందిలోనూ చెంచులు క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటూ అడవికి పహారాగా నిలుస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దట్టమైన కోర్ ఏరియాలో 20 వరకు చెంచుపెంటలు, చెంచుల ఆవాసాలు ఉండగా, వీరి సంపూర్ణ తోడ్పాటుతో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 2018లో 12 పులులు ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 32కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు 187 వరకు చిరుతలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు, మిశ్రమ జంతుజాతులకు నల్లమల నిలయమైంది. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నల్లమలలోని చెంచుల కృషిని ప్రస్తావించారు. ప్రకృతితో మమేకమవుతూ జీవిస్తున్న చెంచులు నల్లమలలో టైగర్ ట్రాకర్లుగా గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ సంఘర్షణకు తావులేదు.. దేశంలో చాలాచోట్ల పులుల అభయారణ్యాల్లో మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణ తలెత్తుతోంది. మనుషులపై పులుల దాడులు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అయితే నల్లమలలోని అమ్రాబాద్ కోర్ ఏరియాలోని దట్టమైన అరణ్యంలో చెంచులు నివసిస్తుండగా.. చెంచులు, పులులకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంఘర్షణ తలెత్తలేదు. అడవిలో పులులు, వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా జీవనం సాగిస్తున్నారు. అడవిలో ఎప్పుడైనా పులితోపాటు ఇతర వన్యప్రాణులు ఎదురైన సందర్భంలో దూరం నుంచే గమనించి వాటి స్వేచ్ఛా విహారానికి భంగం కలిగించకుండా మసులుకుంటారు. క్షేత్రస్థాయిలో వాచర్లుగా చెంచులు.. అటవీ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు పులుల అడుగుజాడలను గుర్తించడం, క్షేత్రస్థాయి విధుల్లో అటవీశాఖ ఇక్కడి స్థానిక చెంచులనే భాగస్వాములను చేస్తోంది. పులుల జాడ తెలుసుకునేందుకు, పాదముద్రలు, విసర్జితాల సేకరణ, పులులు తిరగాడిన ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 130 మంది చెంచు సిబ్బందిని అటవీశాఖ నియమించుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మొత్తం 27 బేస్క్యాంపులకు గానూ 24 క్యాంపుల్లో చెంచులే పనిచేస్తున్నారు.టైగర్ ట్రాకర్లు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లుగా చెంచులే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నల్లమలలో చెంచులు, సమీప ఆవాసాల ప్రజల సహకారంతోనే పులుల సంతతి పెరిగిందని నాగర్కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు. అడవిలో క్షేత్రస్థాయి విధుల్లో ఎక్కువగా చెంచులే సేవలందిస్తున్నారని, భవిష్యత్లోనూ వీరి సంఖ్యను మరింత పెంచనున్నట్టు వివరించారు.పులి కనిపిస్తే ఆగిపోతాం.. అడవిలో పోతున్నప్పుడు పులి ఎదురైతే దూరం నుంచే చూసి అక్కడే ఆగిపోతాం. చప్పుడు చేయకుండా ఉండి పులి అక్కడి నుంచి వెళ్లే దాకా వేచిచూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మమ్మల్ని ఏమీ చేయవు. పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటాం. – గురువయ్య, మేడిమల్కల చెంచుపెంట, నాగర్కర్నూల్ జిల్లా
Related News by category
-
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్, చైనాకు స్వర్ణం : ‘సింక్’ అంటే ఇది! వైరల్ వీడియో
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫాం ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్ విజయాల పరంపరను కొనసాగించారు. చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్ రికార్డు.తొలి రౌండ్లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar— Game of X (@froggyups) August 1, 2024మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్బోర్డ్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. డైవింగ్లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు. -
వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?
సాధారణంగా ఎండు బాదంపప్పులను నానబెట్టుకుని తింటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఐతే వర్షాకాలంలో మాత్రం పచ్చిబాదంపప్పులు తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ సీ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందువల్లే ఇవే తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలంలో ఏవిధంగా ఇవి మంచివో సవివరంగా చూద్దామా..!పెంకు లోపల ఉన్న గింజ పూర్తిగా పక్వానికి రాకముందే ఆకుపచ్చ బాదంపప్పును తినేందుకు వినియోగిస్తారు. ఇది పోషకమైనది కూడా.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..విటమిన్ 'ఈ': గ్రీన్ బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ సీ: రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ కూడా వీటిలో ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు: పరిపక్వ బాదం వలె, ఆకుపచ్చ బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఫైబర్: ఇవి డైటరీ ఫైబర్ను అందిస్తాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.మెగ్నీషియం, పొటాషియంల గని: ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరును నిర్వహించడానికి అవసరమైన ఖనిజాలు.వర్షాకాలంలో ఇవే ఎందుకు తీసుకోవాలంటే..వర్షాకాలంలో అధిక తేమ, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆకుపచ్చ బాదంలో విటమిన్లు ఈ, సీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.వర్షాకాలం వాతావరణం కొన్నిసార్లు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకుపచ్చ బాదంలోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది , ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లోని ఒక అధ్యయనం ప్రకారం, డైటరీ ఫైబర్ గట్ మైక్రోబయోటాను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.వర్షాకాలంలో వచ్చేద హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనిలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఆకుపచ్చ బాదం అనేది హైడ్రేషన్, ఎనర్జీ లెవల్స్ నిర్వహించడానికి సహాయపడే పోషకాల మూలం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.(చదవండి: మినీ డ్రెస్లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!) -
ఒలింపిక్స్లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్రాజన్ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
మినీ డ్రెస్లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!
బాలీవుడ్ జాన్వీ కపూర్ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ డిజైనర్ వేర్ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్. అందులో లీడ్రోల్లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్కి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్వే మినీ దుస్తులతో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. ఈ డ్రెస్ని డీప్ ఆఫ్-ది-షోల్డర్ నెక్లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్ లుక్తో మిస్మరైజ్ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్ అయినా ఆమె దీన్ని కవర్ చేసేలా లోపల చక్కటి స్కిన్ వేర్ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్ టేబుల్స్పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!) -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024
Advertisement