న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘టీమ్ మేనేజ్మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్టౌన్లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు.
ఈ జనవరిలో కేప్టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్లో బౌలర్కు దొరికిపోతారన్నారు.
కేప్టౌన్లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా
Published Fri, Dec 29 2017 12:53 AM | Last Updated on Fri, Dec 29 2017 12:53 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
- మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
- ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు..
- టీఎంసీ నేత ముకుల్ రాయ్ పరిస్థితి విషమం
- గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ సన్మానం
Advertisement
Comments
Please login to add a commentAdd a comment