న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది.
అభివృద్ధి కోసమే బీజేపీలోకి..
తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు.
అమిత్షాతో గోవా సీఎం భేటీ
Published Fri, Jul 12 2019 3:17 AM | Last Updated on Fri, Jul 12 2019 3:17 AM
Related news by tags
-
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్లోని షోరూమ్లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ..
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వ్రస్తాలను ధరించే వారు కొందరైతే, వీఆర్ హ్యాండ్లూమ్.. బీ హ్యాండ్సమ్ అని చెబితే గానీ, చేనేత వస్త్ర ధారణ పై తమకు మక్కువ కలగలేదనే వారు మరి కొందరు. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సాహకుడిగా తన ఉనికిని చాటుకునే మాచన రఘునందన వృత్తిరీత్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. చేనేత పట్ల ఆయనకున్న కమిట్మెంట్పై పలు విశేషాలు.. – సాక్షి,సిటీబ్యూరోమూడు దశాబ్దాలుగా చేనేత వస్త్రాలు మాత్రమే ధరిస్తూ చేనేత వ్రస్తాలపై విస్తత ప్రచారం చేస్తున్నారు. ‘చేనేత వస్త్రాలను ధరించండి.. నేతన్నను ఆదరించండి’. అంటూ తన మిత్రులు, సహచర ఉద్యోగులు హ్యాండ్లూమ్ బట్టలు ధరించేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్లో కీలకపాత్ర పోషిస్తూ చేనేత వ్రస్తాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ప్రచారం కలి్పస్తున్నారు. హ్యాండ్లూమ్కు తన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శ ప్రాయంగా మారారు.చదువుకునే రోజుల నుంచే..మాచన రఘునందన చదువుకునే రోజులనుంచే చేనేత వ్రస్తాలు ధరించడం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వ్రస్తాలను మాత్రమే విధిగా ఉండేలా నిబంధన పెట్టి సఫలీకృతమయ్యారు. చేనేత ఉపయోగాలను జనబాహుళ్యానికి తెలిసేలా తన దైనందిన జీవితంలో అనుదినం చేనేత వ్రస్తాలనే ధరిస్తూ వస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు, ఇలా ప్రతిదీ చేనేతనే ఉపయోగిస్తారు. తాను చేనేత వ్రస్తాలను ధరించడమే కాకుండా కుటుంబ సభ్యులను, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని సైతం చేనేతనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.ఇంట్లోని దుప్పట్లు, మొదలు వివిధ రకాల అలంకరణ వ్రస్తాలను సైతం చేనేతవే వినియోగిస్తుంటారు. ఇక పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా తయారు చేయించి ఇస్తుండడం ఆయన ప్రత్యేకత. ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులను చేనేత తువ్వా ళ్లతో సత్కరించడం ఆయన ఆనవాయితీ. మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూంను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. హ్యాండ్లూమ్ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లేనని ఆయన అభిప్రాయం. మిత్రులు కలిసిన సందర్భంగా డియర్ ఫ్రెండ్.. వీఆర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేయడం ఆయన ప్రత్యేకత. -
బుద్ధుడి మార్గంలో.. మానసిక ప్రశాంతతపై ప్రజల్లో అవగాహన!
‘మనిషి మనసు నుంచే యుద్ధాలు పుట్టు కొస్తాయి.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రపంచ శాంతి స్థాపన సాధ్యం అవుతుంది’ అన్న బుద్ధుడి మాటలే వారికి స్ఫూర్తి.. ఆయన ప్రవచించిన పంచశీల లక్షణాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.. అంతేకాదు ఆయన బోధనలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతతను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం తిమ్మాపూర్లో బోధిసత్వ బుద్ధ్ధవిహార్ పేరుతో క్షేత్రాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారే బుద్ధా లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు.మానవతా బౌద్ధ ధర్మం..హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యాలయం ఫోగువాంగ్ షాన్ పేరుతో తైవాన్లో ఉంది. మానవతా బుద్ధిజాన్ని విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా మైండ్ కల్చర్ను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్ శాఖకు ప్రధాన సలహాదారు అయిన డాక్టర్ బాలు సావ్లా 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. రెండు సార్లు ఈ సంస్థకు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.విద్య, వైద్య సేవలు..హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విద్య, వైద్య పరమైన సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతత గురించి అవగాహన కలి్పస్తూనే చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.దేశ, విదేశాల్లో ప్రచారం..తెలంగాణలో బౌద్ధ మతం ఒకప్పుడు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ఘనమైన చరిత్ర మన నేలకు ఉంది. కాలక్రమేణా బౌద్ధమతం కనుమరుగైనప్పటికీ అప్పటి ఆనవాళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ చరిత్ర గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థాయ్లాండ్, మలేసియా, సింగపూర్, చైనా, కెనడా వంటి దేశాలప్రజలకు ఇక్కడి బౌద్ధ క్షేత్రాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు. మానసిక ప్రశాంతత అవసరం..ప్రస్తుతం ఉన్న బిజీ జీవన విధానంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. బుద్ధుడు చూపిన మార్గంలో వెళ్తే సులువుగా దాన్ని సాధించవచ్చు. ఇప్పటి తరానికి బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం. – డాక్టర్ బాలు సావ్లా, బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, హైదరాబాద్ శాఖ ప్రధాన సలహాదారు -
శభాష్ పోలీస్..!
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.హైదరాబాద్లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్ను రాచకొండ సీపీ సు«దీర్బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు.
Related News by category
-
ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినే అలవాటు మంచిదేనా?
ఇడ్లీ మీద నెయ్యి వేసుకునే అలవాటు మంచిదేనా? ఇలా తింటే బరువు పెరుగుతారా? అని చాలామంది మదిలే మెదిలే సందేహం. అయితే ఇలా ఇడ్లీ మీద నెయ్యి రాసుకుని తినే అలవాటు మంచిదే అంటున్నారు నిపుణులు. అలాగే ఇలా తింటే బరువు పెరుగుతారా అనే సందేహం కూడా వాస్తవమే అని చెబుతున్నారు. మరి తినోచ్చా ?లేదా అంటే..నెయ్యి వేసుకుని తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే ఇడ్లీ, నెయ్యి ఆరోగ్యకరమైనవే. కాబట్టి ఆరోగ్యంగా బరువు పెరగడం, వ్యాయామంతో ఫిట్నెస్ సాధించడమే హెల్దీ లైఫ్ స్టైల్. ఇడ్లీలో కేలరీలు, ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో 120 నుంచి 130 కేలరీలు, అరవై శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు తక్కువ. ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నప్పుడు నెయ్యి మోతాదును బట్టి మూడు వందల నుంచి ఆరు వందల కేలరీలు అందుతాయి. నెయ్యి కావాలి! కొవ్వులో కరిగే ఎ,డి,ఇ,కె విటమిన్ల కోసం దేహానికి నెయ్యి అవసరమే. అలాగే దేహంలో వాపులను నివారించే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ను దేహం సరిగ్గా పీల్చుకోవడానికి కూడా నెయ్యి ఉండాలి. ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు టీ స్పూన్లకు పరిమితం చేస్తే మంచిది. అలాగే రోజువారీ డైట్లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకుంటూ రోజు మొత్తంలో ఆహారంలో ఎన్ని కేలరీలు చేరుతున్నాయో గమనించుకోవాలి. --సుజాత స్టీఫెన్ ఆర్.డి. న్యూట్రిషనిస్ట్(చదవండి: ఈ డ్రైఫ్రూట్తో నిద్రలేమికి చెక్పెట్టండి!) -
ఈ డ్రైఫ్రూట్తో నిద్రలేమికి చెక్!
నిద్రలేమి అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని వేధిస్తున్నసాధారణ సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..శారీర మానసిక ఆరోగ్యం కోసం నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. అయితే చాలామందికి సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహార సమస్యలే అని చెబుతున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య విటమిన్లు ఏ, సీ, డీ, ఈ, కే, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం వల్లే వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాలతో నిండిన ఈ డ్రైఫ్రూట్ తీసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా డ్రైఫ్రూట్? నిద్రలేమికి ఎలా సహాయపడుతుందంటే?నిద్రలేమికి పిస్తాపప్పు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది నిద్రలేమి సమస్యకు సహజ సప్లిమెంట్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మెలటోనిన్ స్లీప్ హార్మోన్తో లోడ్ చేయడబడి ఉంటుంది. మంచి నిద్ర సహాయకారిగా పిస్తాపప్పులను పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చీకటికి ప్రతిస్పందనగా మెలటోనిన్ని ఉత్పత్తి చేస్తుంది. పిస్తాపప్పులు తీసుకుంటే సహజంగానే ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందట.సుమారు 100 గ్రాముల షెల్డ్ పిస్తాలో 23 mg మెలటోనిన్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. నిద్రలేమి కోసం వాడే మెలటోనిన్ సప్లిమెంట్లలో కంటే ఎక్కువ. అంతేగాదు పిస్తాలో మెగ్నీషియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మంచి ప్రశాంతమైన నిద్రను అందించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడు తింటే మంచిదంటే..మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు ఒక గంట ముందు కొన్ని పిస్తాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా లేదా షెల్డ్గా తీసుకోవచ్చు లేదా మంచి రుచి కోసం కాల్చి తినవచ్చు. ఇక్కడ పరిమితికి మించి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు కేలరీలను అందిస్తుంది. అందులోనూ రాత్రిపూట తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కోసం చేయాల్సినవి..ప్రతిరోజూ నిర్ణిత సమయానికే నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు స్క్రీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి.ఎల్లప్పుడూ మీ పడకగదిలో ఉష్ణోగ్రతను 65–68°F మధ్య ఉంచండి.అలాగే నిశబ్దంగా ఉండేలా ఫ్యాన్, ఎయిర్ కండీషనర్ని చూసుకోండికెఫిన్ తాగవద్దు, ఎక్కువ భోజనం చేయవద్దు అలాగే నిద్రవేళల్లో ఆల్కహాల్ లేదా నికోటిన్ని ఉపయోగించవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండిపగటిపూట చురుకుగా ఉండేలా చూసుకుంటే బాగా నిద్రపోవచ్చు ఒత్తిడి, ఆందోళన, చింతించడం లాంటివి దూరం చేసుకోండి. (చదవండి: నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?) -
‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్ మెడల్ బరువెంతో తెలుసా?
ఒలింపిక్స్లో చారిత్రాత్మక స్వర్ణాన్ని సాధించి రికార్డ్ విజయంతో చరిత్ర సృష్టింస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం యావద్దేశాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్ కి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా, స్వర్ణం సాధించాలన్న ఆమె కల కలగానే మిగిలి పోయింది. ఒలింపిక్ పతకంలో ఐదో వంతు బరువు వినేశ్ ఫోగట్ ఆశల్నేకాదు, యావద్దేశ ఆకాంక్షల్ని కుప్పకూల్చింది.Gold medal awarded at the Paris Olympics.pic.twitter.com/dbqgXwPWCY— Figen (@TheFigen_) August 7, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగట్ తొలి మహిళా ఒలింపిక్ ఛాంపియన్గా అవతరించే అవకాశాన్ని కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది. అయితే ఒలింపిక్ ఏయే పతకాలు ఎంతెంత బరువుంటాయి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో 100-150 గ్రాముల బరువుండే లగ్జరీ వస్తువులు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? ఐఫోన్ 15- 171 గ్రాములు కాగా ఒక కాటన్ టీ-షర్టు 100-150 గ్రాములు ఉంటుంది. ఒలింపిక్ పతకాలు, బరువుఒలింపిక్ గోల్డ్ మెడల్ బరువు - 556 గ్రాములుఒలింపిక్ సిల్వర్ మెడల్ బరువు- 550 గ్రాములుఒలింపిక్ కాంస్య మెడల్ బరువు - 450 గ్రాములువినేశ్ ఫోగట్ అనర్హతకు దారితీసిన కారణాలుమంగళవారం రాత్రి ఆమె రెండు కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తొలి మూడు రౌండ్లలో ఆమె 2 కిలోల బరువు పెరిగింది.ఆమె రెండు కిలోలు అధిక బరువుతో ఉందని తెలిసినప్పుడు, ఆమె రాత్రంతా నిద్రపోలేదు , సైక్లింగ్ స్కిప్పింగ్ చేయడానికి జాగింగ్తో సహా ఆ రెండు కిలోగ్రాముల బరువును తగ్గించుకోవడానికి ఆమె సాధ్యమైనదంతా చేసింది. నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్కు కూడా గురైంది.బుధవారం ఉదయం తూకం వేయగా 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారత ప్రతినిధి బృందం 100-150 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది, కానీ ఫలితం లేకుండా పోయింది.Close up of an object that Neeraj Chopra will gift the country…. pic.twitter.com/0DBIK9frR5— Harsh Goenka (@hvgoenka) August 7, 2024 -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి : 7 ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అనేది అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తుంది. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తిన్నారా? తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని మీకు తెలుసా. రండి తెలుసుకుందాం.జీర్ణక్రియకు మంచిదిపెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థనుమంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. అయితే జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. సో...పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కోసంపెరుగులో ప్రోబయోటిక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే, విటమిన్ సీ పుష్కలంగా అంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.చర్మానికి మెరుపుపెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ ఏ, ఇ కూడా అంది, అనేక చర్మ సమస్యలనుంచి రక్షిస్తుంది.ఊబకాయానికి పరిష్కారంజీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు.ఆకలిని పెంచుతుందిపెరుగు ,జీలకర్ర వాడకం ఆకలిని పెంచుతుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఇది చాలామంది. బాడీబిల్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సన్నగా ఉన్నవారు పెరుగు, జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది. కాస్త ఒళ్లు చేస్తారు.కంటి ఆరోగ్యానికిపెరుగులో,జీలకర్రలో నూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పెరుగు, జీలకర్రను కలిపి తీసుకుంటే, విటమిన్ ఎ లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ ఏ కంటికి చాలా ముంచిది.డయాబెటిక్ రోగులకుడయాబెటిక్ రోగులకు డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
Advertisement
Comments
Please login to add a commentAdd a comment