సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎనిమిది విపక్ష పార్టీలు సంయుక్త తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నుంచి ముగ్గురు మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వెలిబుచ్చే నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారని, రాజ్యాంగ హక్కులైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కాలరాస్తున్నారని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. జమ్ము కశ్మీర్లో గృహనిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు మాజీ సీఎంలతో పాటు ఇతర రాజకీయ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది.
‘మాజీ సీఎంల విడుదల కోరుతూ తీర్మానం’
Published Mon, Mar 9 2020 4:09 PM | Last Updated on Mon, Mar 9 2020 6:03 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement
Comments
Please login to add a commentAdd a comment