న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు గౌరవ సూచకంగా నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, దివ్యాంగులకు ఈ నిబంధన ఇబ్బందిగా మారడంతో వారికి సడలింపును ఇస్తున్నట్లు తాజాగా పేర్కొంది అత్యున్నత న్యాయస్ధానం.
మిగతావారు కచ్చితంగా జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది.
జనగణమన: దివ్యాంగులకు ఊరట
Published Tue, Apr 18 2017 2:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Related news by tags
-
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
బచ్చన్ ఫిక్స్
‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు మేకర్స్.‘‘మిస్టర్ బచ్చన్’ పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేస్తున్నాం. ఆగస్ట్ 14న ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఆగస్ట్ 19న రక్షా బంధన్ సెలవు ఉంటుంది. 5 రోజుల లాంగ్ వీకెండ్ మా మూవీకి ప్లస్ అవుతుందనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయిందని డైరెక్టర్ శంకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'గేమ్ ఛేంజర్' పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్న ఇప్పటి వరకు అధికారికంగా మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రమోషన్లలో ప్రకటిస్తాడు అనుకుంటే ఆయన కూడా రివీల్ చేయలేదు.జులై 26న విడుదల కానున్న 'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు 'రాయన్' చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. దిల్ రాజు చెప్పిన ప్రకారం డిసెంబర్ 25న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. దీపావళికి విడుదలవుతుందని ఆశించిన ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది.‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పాన్ ఇండియాలో మోస్ట్ క్రేజీ స్టార్స్.. తొలి స్థానంలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిస్థానంలో నిలిచారు. జూన్ నెలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్లో ప్రభాస్ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ప్లేస్లో షారుక్ ఖాన్ నిలిచారు.ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన జాబితాలో దళపతి విజయ్ మూడోస్థానం, అల్లు అర్జున్ నాలుగు, జూనియర్ ఎన్టీఆర్ ఐదోప్లేస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా.. మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఉన్నారు.కాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో రాజాసాబ్లో ప్రభాస్ కనిపించనున్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/ghuiir9wgG— Ormax Media (@OrmaxMedia) July 21, 2024
Related News by category
-
పిడుగొస్తే.. ఏం చేయాలి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..పిడుగుపాటు బారిన పడకుండా..‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.జీపీఎస్ లొకేషన్ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణ ఏదీ?
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు. -
రీల్స్ మోజులో ప్రాణం పోయింది
లింగోజిగూడ/వర్ధన్నపేట: ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్పై చేసిన స్టంట్ అదుపుతప్పి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు కోనాపురానికి చెందిన మేడ రాజు, మహబూబీ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు.మేడ రాజు కుమారుడు శివ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తన స్నేహితులు సంపత్, పవన్, విజయ్తో కలిసి బైక్లపై ఎల్బీనగర్ పెద్దఅంబర్పేట వైపు బయల్దేరారు. కేటీయం బైక్ ను శివ నడుపుతుండగా సంపత్ వెనుక కూర్చున్నాడు. శివ తన బైక్తో రీల్స్ కోసం స్టంట్లు చేస్తుండగా, మరో బైక్పై ఉన్న పవన్, విజయ్లు వీడియో తీస్తున్నారు. హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శివ నడుపుతున్న బైక్.. స్కూటర్ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు.శివ, సంపత్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శివ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలతో సంపత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివ మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం కోనాపురానికి తరలించారు. హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వీధి కుక్కల బెడదపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు కాటు వేయడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై హైకోర్టు సూచనల మేరకు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.వివిధ జంతు పరిరక్షణ సంఘాలతో సమావేశమై, వీధి కుక్కల బెడద తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని యానిమల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ కమిటీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.సతీశ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లగాన్ మోహన్రెడ్డి, యానిమల్ వెల్ఫేర్ సంస్థల తరఫున అమల అక్కినేని, వాసంతి వడి, న్యాయవాదులు శ్రేయ పరోపకారి, వేణు మాధవ్, ఐపీఎం రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సంపత్, ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు మార్కాపురం జీజీహెచ్లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు.