![India requests Antigua and Barbuda govt to not allow Mehul Choksi - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2018/08/6/hhhh.jpg.webp?itok=N4G-BFTl)
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లకు మోసగించి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మెహుల్ చోక్సీని వెనక్కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని భారత్ అభ్యర్థించింది. చోక్సీని తిరిగి తీసుకొచ్చే విషయమై ఆంటిగ్వా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత్ నుంచి ఓ బృందం కొన్ని రోజుల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత బృందం ఆంటిగ్వా విదేశాంగ శాఖను శనివారం కలిసి, చోక్సీని భారత్కు తిప్పి పంపాలని అభ్యర్థించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని బంధువైన చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12 వేల కోట్ల మేర మోసగించి దేశం నుంచి పారిపోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment