న్యూఢిల్లీ: ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో మూడింటిపై శనివారం దాడులు చేసిన పోలీసులు 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్ అనే ఆశ్రయంలో వందల సంఖ్యలో మహిళలు, బాలికలను బంధించి వారిపై లైంగిక దాడులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి కేంద్రాలు మరో 8 ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు దృష్టికి రావడంతో వాటిలో కూడా సోదాలు జరపాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అందులో భాగంగానే పోలీసులు శనివారం ఆయా కేంద్రాలపై దాడులు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లోనివారు పోలీసులను లోపలకు రానివ్వకపోవడంతో పక్కనున్న భవంతులపైకి ఎక్కి వారు లోపలకు ప్రవేశించారు. గురువారం రోహిణిలోని కేంద్రంపై జరిగిన దాడుల్లోనూ 41 మంది అమ్మాయిలను రక్షించడం తెలిసిందే.
దీక్షిత్ ఆశ్రమాల నుంచి మరో 53 మందికి విముక్తి
Published Sun, Dec 24 2017 2:04 AM | Last Updated on Sun, Dec 24 2017 2:04 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- సిమెంట్ కర్మాగారం ముట్టడి
- వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
- నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
- IND W vs SA W : సమం కోసం చివరి పోరు
- పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
- గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి
- సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
- కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
- స్పీకర్కు కోర్టులు ఆదేశాలివ్వలేవు
Advertisement
Comments
Please login to add a commentAdd a comment