Published
Thu, Apr 20 2017 7:39 PM
| Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి నటిస్తోన్న డ్రామా, థ్రిల్లర్ మూవీ ‘మామ్’ జూలై 7న విడుదల కానుంది. ఐదు సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరిసారి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ అనే చిత్రంలో శ్రీదేవి నటించారు. మామ్ మూవీ జూలై14న విడుదల చేయాలనుకున్నారు చిత్ర నిర్మాతలు ..
కానీ వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి రవి ఉదయవార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.