ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా మహానటి. అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారన్న ప్రశ్నకు ఈ మధ్యే సమాధానం దొరికింది. ముందుగా ఈ పాత్రలో సమంత నటిస్తుందన్న ప్రచారం జరిగినా ఫైనల్గా కీర్తి సురేష్, సావిత్రిగా నటిస్తోందని ప్రకటించారు.
అయితే సమంత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందన్న ప్రకటనతో మరోసారి ఊహాగానాలకు తెర లేచింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ చేస్తోందంటే అది కీలక పాత్ర అయి ఉంటుందని, సావిత్రి హీరోయిన్గా ఉన్న సమయంలో ఆమెతో పోటి పడిన జమున పాత్రలో సమంత నటించబోతుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సమంత చేయబోయే పాత్ర పై కొత్త ప్రచారం జరుగుతోంది.
మహానటి సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తోందట. 80లలో సావిత్రి జీవితం పై పరిశోదన చేసిన విలేఖరి పాత్ర ద్వారా కథ నడిపించాలని ఫిక్స్ అయిన దర్శకుడు, ఆ పాత్రకు సమంతను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.
సమంత క్యారెక్టర్పై మరో ట్విస్ట్..!
Published Tue, Apr 11 2017 3:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
- అగ్గే.. పిడుగు కాదు!
- కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
Advertisement