అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అక్కి విశ్వనాథరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వనాథ్రెడ్డి మాట్లాడుతూ-‘‘భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆర్.కార్తీక్, జోస్యభట్ల కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విడుదల చేశాం.
మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇందులో శక్తిమంతమైన పాత్ర చేశాను. ఆర్టిస్టులు ఎలివేట్ అవ్వాలంటే మంచి నేపథ్య సంగీతం ముఖ్యం. ఇందులో అద్భుతమైన రీ-రికార్డింగ్ కుదిరింది. దర్శకుడు అన్ని శాఖల నుంచి మంచి అవుట్పుట్ని రాబట్టుకున్నారు’’ అని అరవింద్ కృష్ణ చెప్పారు. ఆడియోకి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకులు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, కళ్లు కృష్ణారావు తదితరులు కూడా మాట్లాడారు.
ఊహకందని కోణాలు...
Published Sun, Jun 1 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Related news by tags
-
కంచర్ల సందేశం
‘ఉపేంద్రగాడి అడ్డా’ ఫేమ్ కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ జైస్వాల్ హీరోయిన్. సుమన్, అజయ్ ఘోష్ ఇతర పాత్రలు చేశారు. ఎస్ఎస్ఎల్వీ క్రియేషన్స్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. అరకులో చిత్రీకరించిన తాజా షెడ్యూల్తో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ–‘‘మా ఇంటి పేరైన ‘కంచర్ల’ టైటిల్తో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 15 తర్వాత సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో తీసిన మా చిత్రం గొప్ప విజయం అందుకుంటుంది’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర బాబు. ‘‘కంచర్ల’ సినిమాలో మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు యాద్ కుమార్. ‘‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది’’ అన్నారు మీనాక్షీ జైస్వాల్. -
కాకుడా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ మూవీ ‘కాకుడా’ కూడా ఒకటి. ఈ సినిమా గురించి తెలుసుకుందాం.మానవుని జీవితంలో అత్యంత సున్నితమైన మరియు భయోత్పాతమైన ఉదంతం ఏదైనా ఉంది అంటే అది మరణమే. ఆ మరణ ఇతివృత్తాంతాన్ని వినోదాత్మకంగా మలిచిన చిత్రమే ‘కాకుడా’. ఈ సినిమా జోనర్ హారర్ కామెడీ. దీనికి దర్శకులు ఆదిత్య సరపోతదార్. మామూలుగా హారర్ కామెడీ చిత్రాల్లో దెయ్యం మనుషులను భయపెట్టడం లేదా మనిషే దెయ్యాలను భయపెట్టడం చూశాం. వాటన్నిటికీ విరుద్ధంగా ‘కాకుడా’ సినిమా కాన్సెప్ట్ ఉండడం విశేషం. ఉత్తరాది రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి సంబంధించిన కథ ఇది. ఆ గ్రామం పేరే కాకుడా. ప్రతి మంగళవారం సరిగ్గా రాత్రి 7.15 నిమిషాలకు గ్రామంలోని ప్రతి ఇంటి చిన్న ద్వారం తలుపులు తీసి ఉంచాలి. ఇదే కథాంశం. ఎవరికైనా ఫలానా రోజున తాము మరణించే రోజు అని తెలిస్తే... ఇంకేముంది... క్షణక్షణం బాధతో నరకం అనుభవిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రకి తాను మరణించే రోజు తెలిసినా పైకి కొంత బాధపడుతూనే అందరితో మామూలుగా ఉంటూ కథను నడిపిస్తాడు.రితేష్ దేశ్ముఖ్, సోనాక్షీ సిన్హా వంటి పెద్ద తారలు నటించిన ఈ చిన్న సినిమా ఆద్యంతం కాలక్షేపదాయకం. కొన్ని కొన్ని సన్నివేశాల్లో దెయ్యం రూపం కాస్త పిల్లలను భయపెట్టినా సినిమా మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా సరదా సరదాగా చూడొచ్చు. ఈ వారానికి ‘కాకుడా’ సినిమా వినోదం కోసం గొప్ప ఛాయిస్ అని చె΄÷్పచ్చు. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
పుట్టిన ఊరు కోసం...
‘బిగ్బాస్’ ఫేమ్ అలీ రేజా, సీతా నారాయణన్ జోడీగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్ కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలఅవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిర్మాతలు ప్రసన్న కుమార్, సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామ సత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ– ‘‘పుట్టిన ఊరు కోసం ఎన్ఆర్ఐలు ఏం చేశారు? అనే కథాంశంతో ‘రామ్ ఎన్ ఆర్ఐ’ రూపొందింది’’ అన్నారు. ‘‘లక్ష్మీ నందాగారితో సోలోగా ఓ సినిమా తీస్తున్నాను’’ అన్నారు సింగులూరి మోహన్ కృష్ణ. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మువ్వా సత్యనారాయణ. నటుడు రవి వర్మ మాట్లాడారు. -
విక్రమార్క వస్తున్నాడు
రామ్చరణ్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘మగధీర’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దేవ్ గిల్ హీరోగా నటించిన చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. దేవ్ గిల్ప్రోడక్షన్స్పై ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మించారు.ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దేవ్ గిల్ మాట్లాడుతూ– ‘‘అహో! విక్రమార్క’ సినిమాలో పోలీసుల ధైర్యం, అంకితభావాన్ని గొప్పగా చూపించబోతున్నాం. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఈ మూవీ ద్వారా ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, ఆర్కో ప్రవో ముఖర్జీ.
Related News by category
-
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్ఫారమ్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
కారుపై కన్వర్ యాత్రికుల దాడి
లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు. కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద, నిఫ్టీ 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద ముగిశాయి.గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు భావించిందే.. నిజమని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. జాబ్ మార్కెట్పై కృత్రిమ మేధస్సు (AI) ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచుతుంది. అయితే ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి రంగంలోనూ పెను మార్పులను తీసుకువస్తుంది. దీంతో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది.ఏఐ ప్రభావం ఒక్క భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. పని వేగవంతం కావడమే మాత్రమే కాకుండా.. అధిక ఉత్పత్తి ఏఐ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి.కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి వాటిలో కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఈ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పలు విషయాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే ఏఐ యుగంలో కూడా మనగలగవచ్చు.
Advertisement