డెమాస్కస్: అది సిరియాలోని దారాయా అనే పట్టణం. నిత్యం బాంబు దాడులతో భయం కోరల్లో చిక్కుకున్న ప్రజలు. ఇప్పుడు అక్కడ పెద్దలు బతుకుదెరువుకోసం పాకులాడుతుండగా.. వారి బిడ్డలు మాత్రం తమ బతుకులు ఎందుకు ఇలా తయారయ్యాయని ఒక పెద్ద ప్రశ్నను మోస్తున్నారు. ప్రపంచం మొత్తానికి తమ వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలని నిర్ణయించుకొని దారాయా నగరంలోని చిన్నారులంతా ఆంగ్లం నేర్చుకునే పనిలో పడ్డారు.
ప్రపంచం మొత్తానికి తెలిసిన భాష ఆంగ్లం కావడంతో ఆంగ్లాన్ని నేర్చుకునేందుకు కుస్తీపట్టడమే కాకుండా నేర్చుకున్న భాషతో తమ కష్టాలను వెల్లడిస్తున్నారు. వారి చేస్తున్న సాహసానికి ఓ సంస్థ కూడా తోడై ఒక డాక్యుమెంటరీగా ఓ వీడియోను కూడా రూపొందించింది. అందులో భాగంగా కొంతమంది పిల్లలు చెప్పిన అభిప్రాయాలు విడుదల చేసింది. అందులో ఉన్న అంశాలు ఏమిటంటే..
'మేం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతంలో మూడున్నరేళ్లుగా జీవిస్తున్నాం. పటణంలో జీవించినట్లుగానే అనిపిస్తుంది. కానీ, ఏదో ఒక సమయంలో తమకు నచ్చినవారినో.. నచ్చిన వస్తువునో కోల్పోతున్నాం. మా సమయం మొత్తం బాంబులు, విమాన దాడుల నుంచి తప్పించుకునేందుకు దాచుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడు ఏ భవనంపై బాంబు పడుతుందో తెలియడం లేదు. అసలు మా దగ్గర సివిల్ వార్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు పాఠాలు చెప్పే స్కూళ్లను అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అంటే మేమెంతో అపాయకరమైన స్థితిలో విద్యను అభ్యసిస్తున్నాం. మేం ఇప్పటికీ ఇంగ్లిష్ మాట్లాడలేకపోతున్నాం. కానీ మా టీచర్ సాయం చేస్తున్నారు' అని జహారా, హదాయా అనే పేర్లుగల తదితర పిల్లలు తమ వాస్తవ పరిస్థితులు వెల్లడించారు.
Breadcrumb
పైన బాంబులు.. అండర్ గ్రౌండ్లో పాఠాలు
Published Wed, Apr 27 2016 1:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Related news by tags
-
చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని జిగాంగ్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం 14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.అగ్నిమాపక దళంతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా భవనం దిగువన ఉన్న షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటి? ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తలు తరచూ జరగుతుంటాయి. ఈ ఏడాది మే 20 నాటికి 947 మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40 శాతం మేరకు పెరిగాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, లేదా గ్యాస్ లైన్ల లీకేజీ, నిర్లక్ష్యం మొదలైనవి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ— Steve Hanke (@steve_hanke) July 17, 2024 -
Viral: అధికారులు పట్టించుకోలేదు.. ఓపిక నశించి ఆ రైతు ఏం చేశాడంటే..
తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల వద్ద మొరపెట్టుకునేందుకు ఓ రైతు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లినా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఓపిక నశించి.. ఆ రైతు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాంద్సౌర్ కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) కార్యాలయంలో ఓ వ్యక్తి చేతులు జోడించి పొర్లు దండాలు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఉన్న రైతు పేరు శంర్ లాల్ పాటిదార్. సొంత ఊరిలో కొంత భూమి ఉంది. అయితే ఆ కొంత భూమిని కూడా కబ్జారాయుళ్లు వదల్లేదు. నకిలీ పత్రాలతో తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నారట. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో.. ఆ లాక్కున్న వ్యక్తి కలెక్టర్ ఆఫీస్లో పని చేసే బాబు దేశ్ముఖ్ అని శంకర్ తెలుసుకున్నాడు. అసలైన ధ్రువపత్రాలతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎలాగైనా పైఅధికారులకు ఆ విషయం వెళ్లాలనుకున్నాడు. తన బంధువుల సాయంతో ఓ వీడియో తీశాడు. ఆఫీస్ ప్రాంగణంలో పొర్లు దండాలు పెడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారాయన. దీంతో విషయం.. జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటానని, శంకర్కు న్యాయం చేస్తానని చెప్పారాయన. मंदसौर के बुजुर्ग किसान हैं, कहते हैं कहीं सुनवाई नहीं हो रही आरोप है कि ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है ... कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटे ... pic.twitter.com/bpAHfHp2NH— Anurag Dwary (@Anurag_Dwary) July 17, 2024 -
జేఎన్టీయూ మెస్లో పిల్లి ఘటనపై అనుమానాలు!
హైదరాబాద్, సాక్షి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు. ‘‘నిజానికి హాస్టల్లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్కో, ప్రిన్సిపాల్కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు. జేఎన్టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే.. వంటగది, నిత్యావసరాల స్టోర్రూమ్ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్లు లేవు. కేర్టేకర్లు మెస్లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. -
'అన్ లక్కీ' బ్యాటర్.. పాపం ఎలా ఔటయ్యాడో చూడండి..!
ఓ బ్యాటర్ ఊహించని రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోని చూస్తే.. బ్యాటర్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా అని అనిపిస్తుంది. బౌండరీకి వెళ్లాల్సిన బంతి ఊహించని రీతిలో బౌలర్ చేతిలోకి వచ్చి పడటంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Unluckiest dismissal for a batter. 😄 pic.twitter.com/KosmygSPVX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2024యార్క్షైర్ సెకెండ్ ఎలెవెన్, సోమర్సెట్ సెకెండ్ ఎలెవెన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. యార్క్షైర్ బౌలర్ బెన్ క్లిఫ్ బౌలింగ్లో సోమర్సెట్ బ్యాటర్ నెడ్ లియోనార్డ్ స్ట్రయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న క్యాసే అల్డ్రిడ్జ్ భుజానికి తాకి బౌలర్ చేతుల్లో పడింది. బ్యాటర్ వంగి బంతిని బౌండరీకి మళ్లించే ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. యార్క్షైర్పై సోమర్సెట్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా,. ఛేదనలో చేతులెత్తేసిన యార్క్షైర్ 125 పరుగులకు ఆలౌటైంది. -
మహిళ ప్రాణం తీసిన ప్రాంక్ వీడియో?!
సరదా చేష్టలు చేసి.. వాటిని ప్రాంక్ వీడియోలుగా ప్రమోట్ చేసుకుని ఫాలోవర్స్ను పెంచుకుంటారు కొందరు. అయితే అలాంటి వీడియోలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడో ఘటన చెబుతోంది. కలిసి పని చేసే మహిళపై ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఏకంగా ఆమె ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఓ మహిళ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకుంది. కొలీగ్స్ ఆమెపై ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నిస్తుండగా.. మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నాగినా దేవి మంజీరామ్గా గుర్తించారు. Woman falls off third floor of a complex in Maharashtra's Dombivli. This happened while the woman was with her friends. Another of her friends was saved by bystanders.The woman was identified as Gudiya Devi, who worked as a cleaner in the building. She is survived by a son… pic.twitter.com/tfKpjHFn4U— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు బిల్డింగ్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో రికార్డయిన వీడియోల ఆధారంగా ప్రాంక్ చేస్తుండగా జరిగిన ప్రమాదమని పోలీసులు ఒక అంచానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, భవనంలోని మూడవ అంతస్తులో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దేవితో పాటు మరొకరు సైతం బిల్డింగ్పై నుంచి కిందపడబోతుండగా.. పక్కనే ఉన్న వారు పట్టుకొని పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, ఆ భవనంలో నాగినా దేవి సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపింది. మరణంతో ఆమె కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Related News by category
-
ప్రఫుల్ దేశాయ్పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సివిల్స్లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్చైర్ యూజర్ హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
తెలంగాణలో ‘జంపింగ్స్’ గేమ్.. తిలాపాపం తలా పిడెకడు!
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది ఏమిటంటే మాజీ మంత్రులు , బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ , హరీష్ రావులు ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులపై తీవ్రంగా చేస్తున్న విమర్శలు ఒకవైపు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులను సమర్ధిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకోవైపు ఉన్నాయి. ఫిరాయింపు రాజకీయాల విషయంలో ఒకరినే తప్పుపట్టే పరిస్థితి లేదు. తిలాపాపం తలా పిడెకడు అన్నట్లుగా రాజకీయ నేతలు దాదాపు అందరూ ఈ దిక్కుమాలిన రాజకీయానికి పాల్పడుతున్నారు. కొన్నిసార్లు తమ పార్టీని రక్షించుకోవడానికి అయితే, మరికొన్నిసార్లు ఎదుటి పార్టీని దెబ్బతీసేందుకు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరిని ఉద్దేశించి కేటీఆర్ ఒక మాట అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని వీడి కేశవరావు, కడియం శ్రీహరి వంటివారు వెళ్లారని, పార్టీని వీడడం అంటే తల్లికి ద్రోహం చేసినట్లే అని అన్నారు. వీరిపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. సుప్రింకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి ఫిరాయింపుదారులపై అనర్హత ఓటు వేయాలని డిమాండ్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా ఘాటైన విమర్శలు చేశారు. గతంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అయినా పార్టీకి ఏమీ కాలేదని కూడా ఆయన చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ వ్యతిరేకులు గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ అన్న వ్యాఖ్యల వీడియోని జవాబుగా చూపుతున్నారు. అందులో ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ ,ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారంటే అది తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోందని ఆయన ఎద్దేవ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా తెలంగాణలో బీఆర్ఎస్ అదికారం కోల్పోవడం, కాంగ్రెస్ పవర్ లోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో కాంగ్రెస్ పక్షాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ కు తోడ్పడుతున్నారా అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రకాష్ గౌడ్,అరికపూడి గాంధీలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ముందుగా చంద్రబాబును కలవడం. దాంతో ఆయన సూచన మేరకే వీరు పార్టీ మారారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ ను వదలి విజయవాడ వెళ్లిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకున్నారు. 2014 లో పదిహేను మంది టీడీపీ పక్షాన ఎన్నికైతే ముగ్గురు తప్ప మిగిలిన పన్నెండు మంది అప్పటి టీఆర్ఎస్ లో చేరి పోయారు. ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించేశారు.అప్పట్లో వీరిపై రేవంత్ రెడ్డి పోరాడారు.సుప్రింకోర్టువరకు వెళ్లే యత్నం చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో కేటీఆర్,హరీష్ రావులు ఉండడం విశేషం. ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు.విశేషం ఏమిటంటే 2014 లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన 21 మందిలో మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తదుపరి 2018 లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే పన్నెండు మంది టీఆర్ఎస్లో విలీనం అయిపోయారు. ఈ రకంగా తనకు ఎదురులేని పరిస్థితిని కేసీఆర్ సృష్టించుకున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఆ పేరుతోనే 2023 ఎన్నికలలో పోటీచేసి కాంగ్రెస్ చేతిలో చతికిల పడ్డారు. పీసీసీ అద్యక్షుడుగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో కేసీఆర్ గేమ్ ముగిసి రేవంత్ ఆట ఆరంభం అయింది. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు. కేసీఆర్ మాదిరే ఈయన కూడా ఈ వ్యవహారాన్ని సమర్ధించుకుంటున్నారు.తమ ప్రభుత్వ అభివృద్దిని చూసి ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కేటీఆర్,హరీష్ రావు ఎంత గొడవ చేసినా, ఎన్ని విమర్శలు చేసినా వారికి నైతికంగా ఫిరాయింపులపై విమర్శ చేసే హక్కు కోల్పోయారు. బహుశా ఈ నేపద్యంలోనే కేసీఆర్ ఫిరాయింపులను విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.కాకపోతే తన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపు యత్నాలు చేస్తున్నారు. మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందని ఆయన విశ్వాసం పాదుకొలిపే యత్నం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన చిక్కు ఏమిటంటే కాంగ్రెస్ తో పాటు,బీజేపీ , బీఆర్ఎస్ లు కూడా అధికారం కోసం పోటీ పడుతుండడం, ముక్కోణపు రాజకీయం అవడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. అదే బీజేపీ కనుక బాగా బలహీనంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానప్రతిపక్షంగా పోటాపోటీగా ఉండేది. కాని ఆశ్చర్యంగాబీజేపీ గత లోక్ సభ ఎన్నికలలో పుంజుకుని కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది.దాంతోబీజేపీ కూడా వచ్చే శాసనసభ ఎన్నికల నాటి బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికైతే బీజేపీ బదులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే పది మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు టీడీపీలో కూడా సీనియర్ నేతలుగా ఉండేవారు.తదుపరి టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ అధికారం చవిచూసిన వీరు మళ్లీ అధికార పక్షమైన కాంగ్రెస్ లో ప్రవేశించారు. వారంతా కాంగ్రెస్ లో చేరడం వల్ల రేవంత్ కు మరింత బలం వస్తుందని చెప్పవచ్చు.ఇక దానం నాగేందర్,కాలె యాదయ్యలు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అటు దూకారు. తిరిగి కాంగ్రెస్ పవర్ను సాధించడంతో వారు మళ్లీ ఇందులోకి దూకేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం ఎటు ఉంటే అటు చేరడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు. అధికారంలో లేకపోతే నియోజకవర్గాలలో అసలు పనులు జరగవని, చివరికి పోలీస్ స్టేషన్లలో తమ మాట వినరని భయపడుతున్నారు. ఇతరత్రా ప్రభుత్వంతో ఉండే లావాదేవీల రీత్యా అధికారపార్టీలోకి వెళ్లడం మామూలు అయిపోయింది. దానం నాగేందర్ ది ఆసక్తికరమైన స్టోరీ అని చెప్పాలి. 1994లో టీడీపీ వేవ్ లో కాంగ్రెస్ పక్షాన అసిఫ్ నగర్ నుంచి గెలిచారు. 1999లో కూడా ఆయన గెలుపొందారు. కాని 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీగా పోటీచేయాలని సూచిస్తే,తిరస్కరించి రాత్రికి రాత్రే టీడీపీలో చేరిపోయారు. మళ్లీ గెలవగలిగారు. కాని టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎతో ఉన్న సంబందాల రీత్యా ఆయన వెంటనే పార్టీ మారిపోయారు. పద్దతి ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాని ఉప ఎన్నికలో ఓటమి చవిచూడడం ఆయనకు ఎదురుదెబ్బ అయింది. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచారు. 2014 వరకు మంత్రిగా కూడాఉన్నారు. 2014 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత ఆయన చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఎలాగైతేనేమి ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా బీఆర్ఎస్ సీటు సంపాదించి 2018లో గెలుపొందారు. అలాగే 2023 లో సైతం విజయం సాధించారు. ఆయన ఈసారి గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. దాంతో అధికారంలో ఉన్న కాగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ విడత పదవికి రాజీనామా చేయకపోగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక అంశాన్ని పెట్టినా, దానిని పాటించడం లేదు.ఇంకో సంగతి ఏమిటంటే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు భూ కబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారన్నమాట. ఆయన ఒక్కరనే కాదు. ఇలా పార్టీ మారే ఎమ్మెల్యేలందరికి వారి,వారి కారణాలు ఉంటాయి. టీఆర్ఎస్ నుంచి మరో ఇరవైమందిని లాగితే బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎలాగైతే గతంలో విలీనం చేసుకుందో ,అదే రీతిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావునుకూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించినా, ఆయన పదవికి రాజీనామా చేసి రావడం మంచిదే. ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగడం అంటే రకరకాల వ్యూహాలు ఉండవచ్చు. కొందరికి కాంట్రాక్టులు ఇవ్వవచ్చు. మరికొందరికి ప్యాకేజీలు ఉండవచ్చు.ఇంకొందరు నియోజకవర్గంలో పనులు,ఆదిపత్యం కోసం వెళ్లవచ్చు. రాజకీయాలలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటంటే విపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా, ఎన్నికలలో పోటీచేసి ఓటమిచెందిన అధికార పార్టీ నేతే పవర్ పుల్ గా ఉండడం. ఆయన ఏమి చెబితే దానినే అధికారులు పాటిస్తూ ఉంటారు. పేరుకు ఎమ్మెల్యేనే కాని ఆయన చెబితే పెద్దగా పనులు జరగవు. దీని దృష్ట్యా కూడా విపక్ష ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరూ ఫిరాయింపుల వైపు చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడమే కారణం కావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బాగా బలపడితే మాత్రం ఫిరాయింపుల పర్వం కొత్త అంకంలోకి వెళుతుంది. అలాకాకుండా బీఆర్ఎస్ పుంజుకుని శాసనసభ ఎన్నికలలో విజయావకాశాలు ఉన్నాయని జనం భావించే పరిస్థితి ఏర్పడితే ,అప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్లీ ఇటువైపు దూకవచ్చు. ఈలోగానే బీఆర్ఎస్ ను సాద్యమైనంతగా వీక్ చేయాలన్నది రేవంత్ ఆలోచన అన్నది వేరే చెప్పనవసరం లేదు.ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ,తెలుగుదేశంల మద్యే ప్రధాన పోటీ ఉండేది. ఏదో ఒక పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా పోరాడగలిగేది. టీఆర్ఎస్ ఈ రెండిటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు ఎన్నికలలో పోటీచేసింది. 2014 నుంచి సొంతంగానే పోటీచేస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా గణనీయంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్కు చిక్కులు వస్తున్నాయి. వీటిని అధిగమించగలిగి బీఆర్ఎస్ పోరాటాలు చేయగలిగితే తెలంగాణ రాజకీయాలలో ప్రజల శక్తిగా ఉండి మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందా?లేదా? అన్నది తేలడానికి మరో రెండు,మూడేళ్లు పట్టవచ్చు. అధికారం లేనప్పుడు మొహం చాటేసే నేతలు కూడా గణనీయంగానే ఉంటారు. అదేమి ఊహించనిది కాదు. బీఆర్ఎస్ ఇప్పుడున్న రాజకీయాలలో వీలైనంతవరకు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే మంచిదే. అలా నిలబెట్టుకోలేకపోతే కేసీఆర్ గతంలో చెప్పిన సూత్రం ప్రకారం అది ఆయన తప్పే అవుతుంది. ఫిరాయింపులపై ఏమి మాట్లాడినా అది వారికే తగులుతుంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలను నమ్ముకుని స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Dogs Attack: కుక్కల నుంచి ప్రజలకు రక్షణేది?
శివార్లలోని జవహర్నగర్లో కుక్కల దాడిలో ఏడాదిన్నర విహాన్ మృతి వార్తతో నగర ప్రజల గుండెలు బరువెక్కాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో సైతం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మరణించడం ఎందరినో కలచివేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామనే ప్రకటనలు తప్ప నిజంగా ప్రజలకు.. ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సరైన సమాధానాలు దొరకడం లేదు. ⇒హైదరాబాద్అక్కడ బాగు..జైపూర్, గోవాల్లో ఏబీసీ కార్యక్రమాల అమలు బాగుందనే అభిప్రాయాలున్నాయి. అక్కడ ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలో ( 5–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తారని, ‘మిషన్ రేబిస్’ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారని జంతుప్రేమికులు చెబుతున్నారు. పాఠశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తారని పేర్కొన్నారు.నామ్కే వాస్తేగా హైలెవెల్ కమిటీ ఏళ్ల తరబడిగా కుక్కల బెడద ఉన్నా, వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా.. కుక్కలతో ఇక భయం లేదనుకునే పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో మరణాల మాదిరే కుక్కకాట్లతో సైతం మరణాలు చోటు చేసుకుంటుండటం విషాదకరం. వీధికుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో గత సంవత్సరం జీహెచ్ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా, అది 27అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్కకాట్లు తప్పడం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో ఆరేడు అంశాలు మాత్రం కొద్దిరోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మరచిపోయారు. ఐదు కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు. అమలుకు నోచుకోని అమాత్యుడి హామీ.. బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార వ్యర్థాలు వేసే హోటళ్లు, దుకాణాలను ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాటిని మూసి వేస్తామనే హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ షాపుల వ్యర్థాలు బహిరంగంగా వేయకుండా కవర్లను అందజేస్తామన్న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి హామీ అమలు కాలేదు. మూడు నెలల పాటు వీధికుక్కల స్పెషల్ డ్రైవ్, వీధికుక్కల సమాచారం కోసం ప్రత్యేక యాప్ వంటివి మాటలకే పరిమితమయ్యాయి. సినిమాలు, టీవీల్లో స్లైడ్లు, షార్ట్ ఫిల్మ్, వీడియో కాంటెస్ట్ వంటి వాటితో సహ మిగతా అంశాలు మరచిపోయారు. వీధికుక్కల సంరక్షణకు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలూ అటకెక్కాయి. రాత్రి సమయాల్లోనూ వీధికుక్కలను పట్టుకోవడం, వీధికుక్కల దత్తత వంటివి పట్టింపు లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్దిరోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించిప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్దిరోజులు మాత్రం నిర్వహించారు. ఇంతే చేయగలం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రప్రభుత్వ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)రూల్స్ ,కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ బైలాస్ మేరకు కుక్కల సంతతి తగ్గించడం, రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ (ఏఆర్) వ్యాక్సిన్ వేయడం మాత్రమే తాము చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటితోపాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వంటివి సోకకుండా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్లు వేస్తున్నామంటున్నారు. కాగా.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కుక్క కాట్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వెటర్నరీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. లెక్కకు మిక్కిలిగా.. ⇒ జీహెచ్ఎంసీ గణాంకాల మేరకు పదేళ్లలో 8మంది చిన్నారుల మరణాలు, ఐపీఎం లెక్కల మేరకు 3,36,767 మంది కుక్కల బారిన పడ్డట్లు లెక్కలున్నా, అవి అంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. ⇒ 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఏళ్ల బాలిక మృతి. ⇒ 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ⇒ 2020లో అమీర్పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. ⇒ 2020 ఆగస్ట్లో లంగర్హౌస్లో నలుగురు చిన్నారులకు గాయాలు. ⇒ 2021 జనవరి 30 బహదూర్పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. ⇒ 2023 ఫిబ్రవరిలో అంబర్పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2023 డిసెంబర్లో షేక్పేటలో ఐదు మాసాల పసికందు కుక్కల దాడితో అసువులు బాశాడు. ⇒ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ⇒ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని హైకోర్టు ఆదేశాలున్నా, అమలుకు నోచుకోలేదు. నాలాలు, నిర్మాణాలూ కారణమేవీధికుక్కల బెడద పెరగడానికి ఖాళీ జాగాలు లేకుండా వెలుస్తున్న భవన నిర్మాణాలతో నగరం కాంక్రీట్ జంగిల్గా మారడం కూడా ఒక కారణమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. నాలాల పైకప్పులు, మెష్లతోనూ కుక్కల దాహార్తి తీరే దారి లేకుండా పోయిందంటున్నారు. ఖాళీ జాగాలుంటే నీరుండే ప్రాంతాలుంటాయని పేర్కొన్నారు. ఆహారం, నీరు దొరక్కపోవడం కుక్కలు పిచి్చపట్టినట్లు దాడులు చేయడానికి కారణమని అంటున్నారు. వర్షాకాలంలో చర్మవ్యాధుల బాధలతోనూ తట్టుకోలేక వీధికుక్కలు పిచి్చపట్టినట్లు కరుస్తాయని పేర్కొన్నారు. -
ఆశ పెట్టి.. దోచేసిన కి‘లేడీ’..
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి ఆశపెట్టింది ఓ కి‘లేడీ’. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లాభాల సంగతేమోకానీ అసలు సొమ్ము అయినా తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించింది. ఎట్టకేలకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి అలియాస్ ఇందిరాలా ఇందిరాదేవిరెడ్డి నాగోల్లో దేవిఫుడ్స్, బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మదీనాగూడకు చెందిన ఎస్.సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ప్రవాసరాలినని, తనకు నాగోల్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు ఉన్నాయని నమ్మించింది. నకిలీ యాజమాన్యపత్రాలను కూడా సృష్టించి చూపించింది. ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని ఆశపెట్టి సత్యనారాయణ నుంచి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. బాధితుడి వద్ద నుంచి రెండు కార్లను తీసుకొని తనఖా పెట్టింది. సూడో పోలీసులతో బెదిరింపులు.. అయితే ఆమె ఎంతకీ లాభాలు ఇవ్వడంలేదు. దీంతో లాభాలు కాదు కదా అసలు సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని నిలదీయగా తన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులని పరిచయం చేసింది. వారితో కలిసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈమె నుంచి రెండు కార్లు, ఐ–ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఈమె గతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో బాధితుడి నుంచి రూ.కోటి వసూలు చేసింది. -
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement