గ్వాటెమాలా: పరిమితికి మించి ఖైదీలు ఉండే గ్వాటెమాలా జైలులో మరోసారి ఘర్షణ చోటుచేసుకొంది. ఫలితంగా ఆరుగురు ఖైదీలు ప్రాణాలుకోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బారీ సంఖ్యలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా తెలిపారు.
వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600మందికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందులో 3,092మందిని ఉంచారు. ఇక్కడ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాగా, ఈ జైలులో ఖైదీలుగా ఉన్న మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఈ ప్రాణనష్టానికి కారణమైంది.
'తన్నుకున్న ఖైదీలు.. ఆరుగురు మృతి'
Published Mon, Nov 30 2015 10:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- నేర చట్టాలు సరికొత్తగా..
- నెల్లిమర్ల జూట్మిల్ మళ్లీ మూత
- ఆక్వా రైతుల ఉద్యమ బాట
- వీర జవాన్లకు అశ్రు నివాళి
- రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
- రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి
- మాయమయింది మళ్లీ వచ్చింది
- నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
- నేనంటే లెక్కలేదా..?
- ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి
Advertisement