ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ వార్షిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. క్యాంపస్లోని అతిథి గృహంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, కంట్రోలర్ ప్రొఫెసర్ భిక్షమయ్య ఫలితాల సీడీని ఆవిష్కరించారు. మొత్తం 1,90,518 అభ్యర్థుల్లో 96,442 బాలురు, 94,076 బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం 52.43 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మార్కుల జాబితాలను జులై 1 నుంచి ఆయా కళాశాలల నుంచి తీసుకోవచ్చు. ఫెయిల్ అయిన అభ్యర్థులు రూ.200 చెల్లించి రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం ఆన్లైన్ ద్వారా ఈ నెల 13 నుంచి 24 వరకు, రూ.100 అపరాధ రుసుముతో 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను, పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు.
ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల
Published Fri, Jun 12 2015 6:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Related news by tags
-
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ
టైటిల్: యావరేజ్ స్టూడెంట్ నానినటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLPనిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరిసంగీతం: కార్తీక్ బి కొడకండ్లసినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024‘యావరేజ్ స్టూడెంట్ నాని’ కథేంటంటే..నాని(పవన్ కుమార్) ఓ యావరేజ్ స్టూడెంట్. అమ్మనాన్నలు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా.. అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అక్క(వివియా సంపత్) సహాయంతో మంచి ర్యాంక్ రాకపోయినా బీటెక్లో జాయిన్ అవుతాడు. కాలేజీలో తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల సారా అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. నాని ఈ బాధలో ఉండగానే..కోమాలో ఉన్న తన అక్క తనకోసం చేసిన త్యాగం గురించి తెలుస్తుంది. తనవల్ల ఎవరికి ఉపయోగం లేదని భావించిన నాని.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? నానిని ప్రాణంగా ప్రేమించిన సారా..మరో వ్యక్తితో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది? నాని-సారాల లవ్స్టోరీ గురించి తెలిసిన తర్వాత కూడా అను నానితో ఎలా ప్రేమలో పడింది? యావరేజ్ స్టూడెంట్ అయినా నాని.. చివరకు అందరితో శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఎలా సంపాదించగలిగాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. హీరో యావరేజ్ స్టూడెంట్. అల్లరి చిల్లరగా తిరుగుతూ..చివరకు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటాడు.. ఇలాంటి యూత్ఫుల్ లవ్స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యావరేజ్ స్టూడెంట్ నాని కథ కూడా ఇదే. అయితే యూత్కి ఆకట్టుకునే విధంగా బోల్డ్, గ్లామర్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కొత్తూరి. దర్శకుడు రాసుకున్న పాయింట్ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం రొమాంటిక్ సీన్లతో కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫాదర్-సన్ రిలేషన్, సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా.. బోల్డ్ సీన్ల కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. అయితే యూత్ మాత్రం కొన్ని సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ అంతా నాని కాలేజీ లైఫ్.. సారాతో ప్రేమాయణంతో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సెకండాఫ్లో కాలేజీ సీన్లు బోర్ కొటించినా.. పాదర్-సన్ సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరిలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే పాట ఈళలు వేయిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథనం బోల్డ్గా సాగినా.. అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందిగా అనిపించినా..యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ-నిర్మాణ బాధ్యతలు కూడా పవన్ కుమారే తీసుకున్నాడు. తను రాసుకున్నదే కాబట్టి నాని పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగా పండించాడు. ఎమోషన్ సీన్లలో చక్కగా నటించాడు. హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియల నటనకు పెద్దగా స్కోప్ లేదు కానీ..తెరపై అందంగా కనిపించ్ ఎంటర్టైన్ చేశారు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. చివర్లో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే మాస్ సాంగ్తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
'మహారాజ'కు రజనీకాంత్ ఫిదా.. దర్శకుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆయన సీనీ కెరీర్లో 50వ మైలురాయిని అందుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేడం చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సినీ విమర్శకుల చేత కూడా మెప్పించే విధంగా కథ ఉండటంతో అభినందనలు దక్కాయి. సస్పెన్స్, సెంటిమెంట్తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను సూపర్స్టార్ రజనీకాంత్ అభినందించారు.మహారాజ సినిమాలో దర్శకుడి ప్రతిభ ఎంతమేరకు ఉందో విజయ్ సేతుపతి నటన కూడా అంతే స్థాయిలో ఉంది. సినిమా మొత్తం తన భుజాలపై మోసి అద్భుతమైన నటుడిగా మళ్లీ నిరూపించుకున్నారు. కేవలం రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు రాబట్టింది. ఇంతటీ హిట్ అందుకున్న మహారాజ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్ చూశారు. ఈ సందర్భంలో దర్శకుడు నితిలన్ సామినాథన్ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. రజనీకాంత్ చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. ఆ విషయాలను నిథిలన్ ఇలా పంచుకున్నారు. ప్రియమైన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సమావేశంలో మీ అనుభవాల నుంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేను. మహారాజా సినిమా మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో తలచుకుంటేనే ముచ్చటగా ఉంది. చిరకాలం ఆనందంగా ఉండాలని నన్ను ఆశీర్వదించారు. మరోసారి ధన్యవాదాలు తలైవా..' అని దర్శకుడు నితిలన్ సామినాథన్ పోస్ట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు లైకులు, కామెంట్లు విసురుతున్నారు. తలైవాను కలుసుకునే అవకాశం దక్కినందుకు కంగ్రాట్స్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. -
దర్శన్కు మళ్లీ నిరాశే.. రిమాండ్ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో గత రెండు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. కనీసం ఇంటి భోజనానికి అనుమతి కోరినా కోర్టు అడ్డు చెప్పింది. దీంతో ఆయన తిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, తాజాగా వారిద్దరికి కోర్టు షాకిచ్చింది.రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, వారిద్దరూ ఇప్పట్లో విడుదల అయ్యే భాగ్యం కనిపించడం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో తాజాగా దర్శన్, పవిత్రగౌడ సహా నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు . పరప్పన జైలు నుంచి 13 మంది, తుమకూరు జైలు నుండి నలుగురు నిందితులను హాజరు పరిచారు. వారి రిమాండును పొడిగించాలని సిట్ లాయరు కోరారు. దీంతో ఆగస్టు 14 వరకూ పొడిగించారు. దీంతో బెయిల్ మీదు ఆశలు పెట్టుకున్న దర్శన్కు నిరాశే మిగిలింది. -
రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్యపై కేసు నమోదు..
రాజ్ తరుణ్- లావణ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.మాదాపూర్లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుంన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య గొడవ చేసిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు బలంగా కొడతూ తమను ఆందోళనకు గురిచేసినట్లు వారు చెబుతున్నారు. ఆపై ఇంటి ముందు బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేసి ఇబ్బందులుకు గురిచేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. అయితే, రాజ్ తరణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుని మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె చెబుతుంది.
Related News by category
-
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్, చైనాకు స్వర్ణం : ‘సింక్’ అంటే ఇది! వైరల్ వీడియో
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫాం ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్ విజయాల పరంపరను కొనసాగించారు. చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్ రికార్డు.తొలి రౌండ్లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar— Game of X (@froggyups) August 1, 2024మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్బోర్డ్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. డైవింగ్లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు. -
వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?
సాధారణంగా ఎండు బాదంపప్పులను నానబెట్టుకుని తింటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఐతే వర్షాకాలంలో మాత్రం పచ్చిబాదంపప్పులు తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ సీ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందువల్లే ఇవే తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలంలో ఏవిధంగా ఇవి మంచివో సవివరంగా చూద్దామా..!పెంకు లోపల ఉన్న గింజ పూర్తిగా పక్వానికి రాకముందే ఆకుపచ్చ బాదంపప్పును తినేందుకు వినియోగిస్తారు. ఇది పోషకమైనది కూడా.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..విటమిన్ 'ఈ': గ్రీన్ బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ సీ: రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ కూడా వీటిలో ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు: పరిపక్వ బాదం వలె, ఆకుపచ్చ బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఫైబర్: ఇవి డైటరీ ఫైబర్ను అందిస్తాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.మెగ్నీషియం, పొటాషియంల గని: ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరును నిర్వహించడానికి అవసరమైన ఖనిజాలు.వర్షాకాలంలో ఇవే ఎందుకు తీసుకోవాలంటే..వర్షాకాలంలో అధిక తేమ, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆకుపచ్చ బాదంలో విటమిన్లు ఈ, సీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.వర్షాకాలం వాతావరణం కొన్నిసార్లు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకుపచ్చ బాదంలోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది , ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లోని ఒక అధ్యయనం ప్రకారం, డైటరీ ఫైబర్ గట్ మైక్రోబయోటాను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.వర్షాకాలంలో వచ్చేద హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనిలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఆకుపచ్చ బాదం అనేది హైడ్రేషన్, ఎనర్జీ లెవల్స్ నిర్వహించడానికి సహాయపడే పోషకాల మూలం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.(చదవండి: మినీ డ్రెస్లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!) -
ఒలింపిక్స్లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్రాజన్ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
మినీ డ్రెస్లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!
బాలీవుడ్ జాన్వీ కపూర్ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ డిజైనర్ వేర్ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్. అందులో లీడ్రోల్లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్కి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్వే మినీ దుస్తులతో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. ఈ డ్రెస్ని డీప్ ఆఫ్-ది-షోల్డర్ నెక్లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్ లుక్తో మిస్మరైజ్ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్ అయినా ఆమె దీన్ని కవర్ చేసేలా లోపల చక్కటి స్కిన్ వేర్ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్ టేబుల్స్పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!) -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024
Advertisement