సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందేనని ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. పర్యవేక్షణ కమిటీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవద్దని, అలా చేస్తే కేసులో వాదనలు వినిపించేందుకు అనుమతించబోమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.
ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
‘అగ్రిగోల్డ్’ పర్యవేక్షణ కమిటీకి సౌకర్యాలు కల్పించాల్సిందే
Published Fri, Apr 8 2016 1:43 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement