బ్యాచ్లర్ ఆఫ్ సోషల్ వర్క్... గ్రాడ్యుయేషన్ విషయంలో ఇలాంటి కోర్సును ఎంచుకునేవారు కచ్చితంగా ప్రత్యేకమైన వ్యక్తులే అయి ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైనవారిలో ఒకరు నేపాల్కు చెందిన పుష్ప బస్నెత్. సోషల్వర్క్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన పుష్ప, గత ఏడు సంవత్సరాలుగా తన సేవాకార్యక్రమాలతో పీహెచ్డీల స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ రోజుల్లో తన కాలేజీ అసెస్మెంట్లో భాగంగా పుష్ప... ఖాట్మండులోని మహిళా కేంద్ర కారాగాన్ని సందర్శించింది. జైళ్లలో వాస్తవ పరిస్థితులను గమనించిన పుష్ప దృష్టి అక్కడున్న చిన్నారుల మీద పడింది. వారి గురించి వాకబు చేస్తే... వారి తల్లులు వివిధ నేరాలు చేసి జైలు శిక్షను అనుభవిస్తున్నారనీ, సంరక్షణకు మరో మార్గం లేక ఆ పిల్లలను కూడా జైలులోనే ఉంచామని అధికారులు వివరించారు.
ఆ చిన్నారుల పరిస్థితిని చూసి పుష్ప ఆవేదన చెందింది. వారి పసిప్రాయం జైలులోనే గడిచిపోవడం దురదృష్టకరం అనిపించింది. ఏదోవిధంగా ఆ చిన్నారులకు జైలు నుంచి విముక్తి కల్పించి, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలని కృత నిశ్చయురాలైంది. చిన్నారులను సంర క్షించే బాధ్యత స్వీకరిస్తానని ఆమె ముందుకొచ్చింది. జైలు అధికారులతో, ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడింది. అయితే అటు అధికారులు గాని, ఇటు పిల్లల తల్లిదండ్రులు గాని స్పందించలేదు.
ఆఖరికి పుష్ప తల్లిదండ్రులు కూడా ... చక్కగా చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోమన్నారు. పుష్ప మాత్రం తను సోషల్వర్క్లో డిగ్రీ పుచ్చుకున్నది సాధారణ ఉద్యోగాల కోసం కాదన్నట్టుగా స్నేహితుల, దాతల సహకారంతో ‘ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ సెంటర్’ (ఈసీడీసీ) ను స్థాపించింది. తనే కర్త, కర్మ, క్రియగా మొదలైన ఈ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యకలాపాల్లో భాగంగా... మొదటగా జైలు నుంచి ఐదుగురు పిల్లలను తెచ్చుకుని పగలంతా తన దగ్గర పెట్టుకుని సాయంత్రానికి వదలి రావడం ప్రారంభించింది. అలా మొదలైన పుష్ప శిక్షణ ఇప్పుడు దాదాపు వందమంది చిన్నారులకు ఉచితంగా వసతి, ఆహారం, చదువు, వైద్య సేవలను అందించడం వరకు విస్తరించింది.
ఈ సేవాకార్యక్రమాలతో పుష్పకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్నవారిగా సీఎన్ఎన్ చానల్ కొంతమందికి ఇచ్చే ‘హీరోస్’ గుర్తింపుతో పాటు, ప్రోత్సాహకంగా వారు ఇచ్చే మూడు లక్షల డాలర్లను బహుమతిగా అందుకుంది.
శ్రీకృష్ణ జన్మస్థానంలో బాల్యం గడపాల్సిన బాలలకు స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించి, విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఈ పుష్పం చిన్నారుల పాలిట సేవాగుచ్ఛం.
చిన్నారులకు పుష్పగుచ్ఛం
Published Mon, Dec 23 2013 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Related news by tags
-
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv— ANI (@ANI) May 6, 2024 -
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. గెహ్లాట్కు ఎదురుదెబ్బ!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్లతో కూడిన పెన్ డ్రైవ్ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు. అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు. Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024 అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!
రాజస్థాన్లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్ నమ్ముకుంటోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది... పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్సింగ్ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించారు. బీజేపీకి బేనీవాల్ బెంగ! 2014 లోక్సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్స్వీప్ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్ బేనీవాల్ సారథ్యంలోని ఆర్ఎల్పీ ఈసారి కాంగ్రెస్తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే. జాట్ నేత అయిన బేనీవాల్కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్సింగ్ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్లో పసిడి సాధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్–బరన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్లో అదే వర్గ పోరు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్ వర్గం ఉంది. జాలోర్ నుంచి గహ్లోత్ కుమారుడు వైభవ్ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. ఆర్ఎల్పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్ ప్రభావం షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది. కుల సమీకరణాలు కీలకం రాజస్థాన్ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్పుత్లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్పుత్ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టినవారే. జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్పుత్ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్లాల్ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్కు వైట్వాష్ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు.
Related News by category
-
TTD : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 67,916 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,010 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.93 కోట్లుగా లెక్క తేలింది. -
ఇసుక ధర పెంపు.. కొనుగోలుదారుల నిరసన
భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధవారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్నుకు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది. అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది. ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్ చేశారు.ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలసఉచితమని ప్రకటించడం ఎందుకు?ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం -
విధుల్లేకుండా.. జీతాలివ్వకుండా..
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ–జనసేన–బీజేపీ నేతల మాటలకు.. అధికారంలోకి వచ్చాక వారి వైఖరికి ఎక్కడా పొంతన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ తీరు చూస్తుంటే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ముందు కొందరు రాజీనామాలు చేయగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 6వేల మంది వలంటీర్లు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. పైగా.. విధులూ చెప్పడంలేదు. స్థానిక ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలతో డీడీఓలు వలంటీర్ల గౌరవ వేతన బిల్లులు పెట్టడంలేదని వలంటీర్ల సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి.. జూన్ ఒకటిన వీరు సకాలంలో వేతనాలు అందుకోగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు తర్వాత వీరి ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో జూన్ నెల గౌరవ వేతనాలు ఇప్పటివరకు వలంటీర్లకు అందలేదు. అలాగే, రేపు ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఎక్కువమంది డీడీఓలు తాత్సారం చేస్తున్నారని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విధులు అప్పజెప్పని సర్కారు.. మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా వలంటీర్లకు ఎలాంటి విధులు కూడా అప్పజెప్పడంలేదని వారంటున్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పింఛన్ పంపిణీని వీరు ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబి్ధదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించగా.. చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై ఒకటిన వలంటీర్లతో కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఆగస్టు ఒకటిన చేపట్టే పింఛన్ల పంపిణీకీ కూడా ప్రభుత్వం వలంటీర్లను దూరంగా ఉంచబోతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తమతో దోబూచులాడుతోందని... అలాగే, వలంటీర్ల వ్యవస్థ అవసరమేలేదన్నట్లుగా ఉందని వలంటీర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐదేళ్లపాటు అన్నింటా వారే..వాస్తవానికి.. గత ఐదేళ్లలో వలంటీర్ల సేవలు కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో 2019–24 మధ్య ప్రభుత్వం అమలుచేసిన 33 రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతికి, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాల లబ్ధిని నేరుగా లబి్ధదారుల ఇంటివద్దే వలంటీర్లు అందించారు. గ్రామాల్లో ప్రభుత్వాఫీసుల్లో ఎవరికి ఏ పని ఉన్నా వలంటీర్లు వారికి దిక్సూచిగా పనిచేశారు. ప్రభుత్వం ఏ పథకం అమలుచేసినా వీరే ఇంటింటికీ వెళ్లి ఆయా పథకాల గురించి వారికి వివరించి, అర్హులను గుర్తించి, అవి వారికి అందేలా ఎంతో తోడ్పడ్డారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో వలంటీర్ల సేవలను ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా రెండు విడతల చొప్పున ఫీవర్ సర్వేను విజయవంతంగా పూర్తిచేసి కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పింఛన్ల పంపిణీ నుంచి వారిని దూరంపెట్టి ఆ కార్యక్రమానికి వారి అవసరమేలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆందోళన బాటలో వలంటీర్లు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇవ్వడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల్లో తమపట్ల స్పష్టమైన వ్యతిరేక భావన కనిపిస్తోందని వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పనిచేసిన వలంటీర్లు అందరినీ కొనసాగించడంతో పాటు తమకు జూన్ నెల గౌరవ వేతనం బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నెలన్నర రోజులుగా మంత్రులు, అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు వలంటీర్ల సంఘ ప్రతినిధులు చెప్పారు. -
‘హామీ’ ఇవ్వలేం!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకిచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలను మంగళవారం ప్రొరోగ్ చేసి బుధవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ను తీసుకువచ్చి ంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు నాలుగు నెలల కాలానికి రాష్ట్ర సంచిత నిధి నుంచి రూ.1,29 లక్షల కోట్ల వ్యయానికి అనుమతిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. దీంతో న్యాయ శాఖ కార్యదర్శి సునీత ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవలే అధికారంలోకి వచ్చి నందున, ఆరి్థక శాఖ ఇతర శాఖలతో సమన్వయపరుచుకుంటూ అప్పులు, ఆరి్థక వనరులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేమని అందులో పేర్కొంది. పూర్తి స్థాయి బడ్జెట్కు మరి కొంత సమయం కావాల్సి ఉందని, శాసన సభ ఇప్పుడు సమావేశంలో లేనందున ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ద్వారా నాలుగు నెలల వ్యయానికి ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చి ందని ఆర్డినెన్స్లో పేర్కొనడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలు జూలై 26వ తేదీ వరకు నిర్వహించినప్పటికీ పూర్తి బడ్జెట్ను ప్రవేశ పెట్టకుండా శ్వేత పత్రాల పేరుతో గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే చంద్రబాబు ప్రభుత్వం పరిమితమైంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవ అప్పులను బడ్జెట్ డాక్యుమెంట్లో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అప్పులపై చంద్రబాబు అండ్ కో ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోతుంది. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలకు పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాల్సి వస్తుంది. ఈ రెండు అంశాల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్! కేంద్రం నుంచి వచ్చే ఆదాయ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు స్పష్టంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోవడానికి కేవలం హామీలను ఎగరకొట్టేందుకేనని స్పష్టం అవుతోంది. గతంలో ఎప్పుడూ ఒకే ఆరి్థక సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో కోవిడ్ లాంటి అసాధారణ పరిస్థితులు లేకున్నా, ఆర్డినెన్స్ జారీ విడ్డూరంగా ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే 4 నెలల వ్యయానికి సభ ఆమోదం పొందే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. తొలి వంద రోజుల్లో ప్రాధాన్యతాంశాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వాటిలో ఆర్థికంగా ముడిపడి ఉన్న సూపర్ సిక్స్ హామీలకు చోటు లేదు. తల్లికి వందనం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి అంశాలు 100 రోజుల ప్రాధాన్యతాంశాల్లో లేవు. నాణ్యమైన లిక్కర్, నూతన ఇసుక విధానం, నూతన ఎంఎస్ఎంఈ విధానం, నూతన పారిశ్రామిక విధానం, సీఆర్డీఏలో పెండింగ్ పనులు పూర్తి చేయడం, చెత్త తొలగింపు తదితర ఆరి్థకేతర అంశాలే 100 రోజుల ప్రాధాన్యతల్లో ఉన్నాయి. దీంతో పాటు హామీలను తక్షణమే అమలు చేయడం సాధ్యం కాదని కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించిన విషయం తెలిసిందే. హామీలను ఇప్పట్లో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. -
నేడు హంద్రీ–నీవాకు నీటి విడుదల
సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యానికి, కూటమి సర్కారు నిర్వాకాలకు రాయలసీమలో దాదాపు 6.02 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన సంస్థ కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం పుట్టా సంస్థ కెనాల్ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. కాలువను పూడ్చేటప్పుడు నీళ్లు వెళ్లేందుకు వీలుగా పైపులు వేయకుండా అప్రోచ్ రోడ్డు నిరి్మంచారు. దీంతో రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. రాత్రి కూడా పనులు.. నేడు నీటి విడుదల ‘పుట్టా పాపం.. సీమకు శాపం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో జలవనరులశాఖ అధికారులు ఉదయమే హంద్రీ–నీవా కెనాల్ వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయాలు అన్వేíÙంచారు. ప్రస్తుతం కాలువ పూడ్చిన ప్రాంతం పక్కనే చిన్న సైజు సిమెంట్ పైపులు వేసి దానిపై రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాత్రి పూట కూడా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించి గురువారం ఉదయానికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు మల్యాల వద్ద మోటార్లు ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. స్వల్ప ప్రవాహం ‘అనంత’కు చేరేదెలా? హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కాగా లైనింగ్ లేనందున 2,300–2,500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తాయి. అయితే ఇప్పుడు పుట్టా సుధాకర్ సంస్థ తాత్కాలికంగా అమరుస్తున్న పైపుల ద్వారా 500 క్యూసెక్కులకు మించి ప్రవహించవని అధికారులు చర్చించుకుంటున్నారు. కాలువను పూడ్చి అప్రోచ్ రోడ్డు నిరి్మంచే సమయంలోనే పెద్ద పైపులు వేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. 15 రోజులుగా నీళ్లు వదలకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తాపీగా చిన్న సైజు పైపులు వేస్తున్నారు. పెద్ద పైపులు వేసి ఉంటే 1000–1500 క్యూసెక్కులు ప్రవహించే వీలుండేదని నీటి పారుదలశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. దీంతో నీళ్లు విడుదల చేసినా స్వల్ప ప్రవాహం కర్నూలులోని క్రిష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లను దాటి అనంతపురం జిల్లాకు చేరే అవకాశం కనిపించడం లేదు. కాస్త ఆలస్యంగానైనా ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించింది. ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతితో శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలంలో 834 అడుగులకే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా కళ్లప్పగించి చూసింది. రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు వదులుతున్నా హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేసే మల్యాల పంప్లను ఇప్పటిదాకా ఆన్ చేయలేదు. నాడు రిజర్వాయర్లు కళకళ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా హంద్రీ–నీవా ద్వారా 2020లో 47.34 టీఎంసీలు, 2021లో 45.65 టీఎంసీలు విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టి రైతుల సంక్షేమాన్ని కాంక్షించారు. నాడు ‘సీమ’లో చెరువులన్నీ నిండి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడాయి. ఇప్పుడు చిన్నసైజు పైపులతో 500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తే సీజన్ మొత్తంలో కనీసం 5 టీఎంసీలు కూడా నీటిని డ్రా చేయలేని దుస్థితి కనిపిస్తోంది. నీళ్లున్నా ఎందుకీ నిర్వాకం? చంద్రబాబు పాలనలో ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం జీవో 22 జారీ చేసింది. దీంతో కళ్లెదుట నీళ్లు పారుతున్నా రైతులు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శ్రీశైలంలో నీళ్లు ఎక్కువై పది గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నా దుర్భిక్ష ‘సీమ’కు అందని దుస్థితి ఉత్పన్నమైంది. రోడ్డు నిర్మాణ ప్రాంతంలో కాలువ సామర్థ్యం మేరకు పైపులైన్లు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించి ఉంటే పుట్టా సుధాకర్ సంస్థ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. పెద్ద పైపులైన్లు వేస్తే 2 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ప్రవాహం దిగువకు వెళ్లేది. అన్నదాతల ఇక్కట్లపై వైఎస్సార్ సీపీ తక్షణమే స్పందించి నిలదీయడంతో ఇక తప్పించుకునే అవకాశం లేక కంటి తుడుపు చర్యలు చేపట్టారు. దీంతో హంద్రీ–నీవా నీటి కోసం రైతు సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి.
Advertisement