కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య | woman commits suicide with son in ysr district | Sakshi
Sakshi News home page

కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య

Published Thu, Aug 11 2016 12:52 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

woman commits suicide with son in ysr district

ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రేగులపల్లెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి జయలక్ష్మి(25) అనే మహిళ కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మొదట కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పంటించి.. తర్వాత తను కూడా ఆత్మహత్మకు పాల్పడింది. తీవ్రగాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement