చింతూరు : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో వరుసగా జరుగుతున్న మందుపాతరల పేలుళ్లకు సాధారణ పౌరులూ బలవుతున్నారు. సుక్మా జిల్లాలో గురువారం మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఓ చిన్నారి బలవ్వగా తాజాగా శుక్రవారం ఇదే జిల్లాలోని భెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోగల కొత్తచెరువు గ్రామం వద్ద జరిగిన పేలుడుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
గోర్ఖా గ్రామం కోసీపారాకు చెందిన ముచ్చిక హిడ్మా (55) విప్పపూలు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళకు గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో వారం వ్యవధిలో మూడు మందుపాతరల పేలుళ్లకు ముగ్గురు బలి కావడంతో గ్రామీణులు రహదారులపై నడవాలంటేనే వణికిపోతున్నారు.
మావోయిస్టుల మందుపాతరకు మహిళ బలి
Published Fri, Mar 18 2016 7:51 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ధగ ధగ.. దగా!
- టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
- కుక్కలదాడిలో బాలుడి మృతి
- ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
- ప్రాణం తీసిన అతివేగం..
- మౌలికం 6.3 శాతం అప్
- గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
- కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
- రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
- టెన్త్ అడ్వాన్స్డ్లో 73.03% ఉత్తీర్ణత
Advertisement