అనపర్తి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనపర్తి మండలం రామవరం గ్రామంలోని దళితవాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమయ్యాయి.
ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అనపర్తి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అనపర్తిలో భారీ అగ్ని ప్రమాదం
Published Sun, Apr 17 2016 1:56 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
- ఇవేం కష్టాలు తిరుమలేశా!
Advertisement