ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఆదివారం విడుదల చేస్తున్నట్లు యూజీ డీన్ ఆచార్య జీవన్కుమార్ తెలిపారు.
నేడు డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు
Published Sun, Aug 28 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
Related news by tags
-
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్, చైనాకు స్వర్ణం : ‘సింక్’ అంటే ఇది! వైరల్ వీడియో
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫాం ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్ విజయాల పరంపరను కొనసాగించారు. చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్ రికార్డు.తొలి రౌండ్లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar— Game of X (@froggyups) August 1, 2024మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్బోర్డ్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. డైవింగ్లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు. -
విస్తరణవాదం కాదు.. అభివృద్ధి కావాలి: మోదీ
న్యూఢిల్లీ: విస్తరణవాదం కాదు... అభివృద్ధి కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా చైనాకు చురక అంటించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ అభివృద్ధికేనని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్చిన్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. వియత్నంలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరువురు ప్రధానమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాల్లో ఆరు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు చేశారు. మరో మూడు ఒప్పందాలను ఖరారు చేశారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఫామ్ మిన్చిన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
చైనా కవ్వింపు చర్య.. భారత్ భూభాగంలో వంతెన నిర్మాణం
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024 ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది. -
భారత్లో చైనా పెట్టుబడులు: పీయూష్ గోయల్ ఏమన్నారంటే?
చైనా పెట్టుబడులకు సంబంధించిన విషయం మీద కేంద్రమంత్రి 'పియూష్ గోయల్' స్పష్టమైన వివరణ ఇచ్చారు. చైనా ఎఫ్డీఐకి మద్దతు ఇవ్వడంపై పునరాలోచన లేదని, ఆర్థిక సర్వే దీనికి ఏమాత్రం కట్టుబడి లేదని ఆయన అన్నారు. చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి వెల్లడించారు. చైనా పెట్టుబడుల ద్వారా ఉత్పత్తిని పెంచి.. ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని సర్వే అభిప్రాయపడింది. ఈ కారణంగానే కేంద్ర మంత్రి కూడా చైనా ఎఫ్డీఐలను ప్రోత్సహించాలని పేర్కొన్నారని, పియూష్ గోయల్ అన్నారు.జూన్ 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత భారత ప్రభుత్వం మనదేశంలో సుమారు 200 చైనా యాప్లను నిషేదించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD నుండి వచ్చిన ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనను కూడా ఇండియా తిరస్కరించింది. -
58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్లోకి ఎంట్రీ: ఓ దేశంలో పుట్టి మరో దేశానికి ప్రాతినిథ్యం
పారిస్ ఒలింపిక్స్ 2024లో చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యధిక వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. జియింగ్ జెంగ్ 58 ఏళ్ల లేటు వయసులో ఒలింపిక్స్ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒలింపిక్స్లో పాల్గొనాలన్నది జెంగ్ చిరకాల కోరిక. తన కోరికను జెంగ్ లేటు వయసులో సాకారం చేసుకుంది. సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డు కాదని జెంగ్ నిరూపించింది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. జియింగ్ జెంగ్ ఒలింపిక్స్ ప్రస్తానం అంత సులువుగా సాగలేదు.18 సంవత్సరాల వయస్సులో జెంగ్ తన జన్మ దేశమైన చైనా తరఫున ఒలింపిక్స్లో పాల్గొనాలని ఆశించింది. అయితే టేబుల్ టెన్నిస్ ఒలింపిక్స్ అరంగేట్రానికి ముందే ఆమె కెరీర్కు బ్రేక్ పడింది. వివిధ కారణాల చేత జెంగ్ తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది. 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. కొంతకాలం తర్వాత ఆమె చిలీకి వెళ్లి వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇచ్చింది.2000లో జెంగ్ ఉద్యోగరిత్యా టేబుల్ టెన్నిస్కు పూర్తిగా దూరమైంది. అనంతరం 20 సంవత్సరాల పాటు ఆటతో సంబంధం లేకుండా ఉండింది. కోవిడ్ సమయంలో జెంగ్ తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. 2024 ఒలింపిక్స్లో చిలీకి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టకేలకు ఆమె 58 సంవత్సరాల వయస్సులో తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.
Related News by category
-
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్లలో బేబీ బెర్త్లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్లకు బేబీ బెర్త్లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
వయనాడ్లో 100 ఇళ్లు కట్టిస్తాం : రాహుల్ గాంధీ
కేరళ వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచరియల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300లు దాటింది. దాదాపు 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బాధితుల్ని పరామర్శించేందుకు వయనాడ్లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భాంగా వియనాడ్ విషాదంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం తానెక్కడ చూడలేదన్న ఆయన..బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం.
Advertisement