న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులే ఆఫీసు... రోజుకు 11 గంటల పని... ఈ పద్ధతి పాటిస్తే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందంటున్నారు అంతర్జాతీయ ప్రముఖులు. ప్రపంచంలో రెండో అత్యధిక ధనవంతుడు, మెక్సికోకు చెందిన స్లిమ్ కార్లోస్, సుప్రసిద్ధ బ్రిటిష్ వాణిజ్యవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఈ కొత్త పద్ధతిపై అమితాసక్తి చూపుతున్నారు. ‘వారానికి మూడు రోజుల పని, నాలుగు రోజులు సెలవులుండడమే మంచిది.
వారానికి ఐదారు రోజులకు బదులు రోజుకు 11 గంటల చొప్పున మూడు రోజులు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది..’ అని వారు చెబుతున్నారు. భారతీయ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగాల్లో ఈ మోడల్ ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు. ‘రోజుకు 11 గంటల పని అంటే రన్నింగ్ రేసు వంటిదే. కస్టమర్ సర్వీసు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ వంటి రంగాలకు కొత్త పద్ధతి అనువుగా లేదు.
ఉత్పాదకత కీలకమైన వర్ధమాన దేశాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిఉంది. అందుకే, ఈ పద్ధతి భారత్కు తగినట్లుగా లేదు’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా హెచ్ఆర్ హెడ్ టి.శివరామ్ చెప్పారు. ‘కొత్త మోడల్లో ఉద్యోగులు వారానికి 33 గంటలే పనిచేస్తారు. గంటల లెక్కన జీతం చెల్లిస్తారు. వారానికి 40 గంటల పనితో పోలిస్తే ఉద్యోగులకు వేతనాలు తగ్గుతాయి. ఆ లోటు పూడ్చుకోవడానికి మరో ఉద్యోగం వెతుక్కోవాలి’ అని అంటాల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ జోసెఫ్ దేవాసియా పేర్కొన్నారు.
3 రోజుల ఆఫీసు మనకు తగదు..
Published Mon, Aug 4 2014 5:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Related news by tags
-
ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల సవరణ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆసుపత్రులలో రోగు లకు అందించే చికిత్సల రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. 2013 తర్వాత కొత్త ధరలను ప్రకటించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.రేట్ల సవరణపై అధ్యయనం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల లోని మెడికల్, సర్జికల్ విభాగాల నిపుణు లతో చర్చించి మొత్తం 1,672 ప్యాకేజీలలో 1,375 ప్యాకేజీ రేట్లను సవరించాలని నిర్ణయించింది. మిగి లిన ప్యాకేజీ ధరలు మారవని తెలిపింది. 2013 నుంచి 2024 వరకు ధరల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20–25 శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 163 కొత్త చికిత్సలు: ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తు తం ఉన్న వ్యాధులకు అదనంగా 163 కొత్త ప్రొసీ జర్లను చేర్చారు. ఈ మేరకు మరో ఉత్తర్వు విడుదల చేశారు. దీంతో మొ త్తం ప్రొసీజర్ల సంఖ్య 1,835కి పెరిగింది. కొత్త ప్రొసీజర్స్తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకో బోతున్నామని మంత్రి దామోదర తెలిపా రు. 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ప్రభుత్వం అదుకుంటుందని చెప్పారు. 2007లో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఆ సందర్భంగా 120 ఆసుపత్రుల్లో 533 వ్యాధు లకు చికిత్సలను అందుబాటు లోకి తెచ్చా రని దామోదర గుర్తుచేశారు. 2022లో 830 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయన్నారు. 90.10 లక్షల మంది ఆరోగ్యశ్రీకి అర్హులుగా ఉన్నారన్నా రు. 1,356 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధి లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీలో కొత్తగా 163 ప్రొసీజర్లను ప్రవేశపెట్టి న నేపథ్యంలో వాటి వివరాలను ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది. అందులో ప్రధా నంగా టైప్–1 డయాబెటీస్కు ఇన్సులిన్ పంప్స్ ప్యాకేజీ కింద ఏడాదికి ఒక రోగికి రూ. 2 లక్షల వరకు కేటాయించారు. -
స్మితా సబర్వాల్ మెంటల్గా అన్ఫిట్
పంజగుట్ట/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అఖిల భారత సర్వీసు (ఏఐఎస్)ల్లో దివ్యా ంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రశ్నించిన సీని యర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్య లను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఐఏఎస్ అధికా రిణి మల్లవరపు బాలలత తీవ్రంగా ఖండించారు. బ్యూరో క్రాట్లకు శారీరక ఫిట్ నెస్కన్నా మానసిక ఫిట్నెస్ ఉండాలని.. కానీ స్మిత ఫిజికల్గా ఫిట్గా ఉన్నారేమో కానీ మెంటల్గా ఫిట్గా లేరని మండి పడ్డారు.తన లాంటి దివ్యాంగులను ఉద్దే శించి ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దివ్యాంగులను దూరంగా పెట్టాలని సమా జానికి సంకేతం ఇస్తున్నట్లుగా ఉన్నాయ న్నారు. సోమవారం హైదరా బాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో బాల లత మాట్లా డారు.స్మిత వ్యాఖ్యలు వ్యక్తిగత మైనవా లేక ప్రభుత్వ ప్రతినిధిగా చేసినవో ఆమె వివరణ ఇవ్వాలన్నారు. ఆమెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని.. 24గంటల్లోగా ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి సమాధి స్ఫూర్తిస్థల్ వద్ద దివ్యాంగ సమాజమంతా శాంతియుత నిరసన తెలుపుతామన్నారు.ప్రతిపక్షాలు, మీడియా, సమాజం స్పందించాలి..జైపాల్రెడ్డి లాంటి పెద్ద నేత రెండు కాళ్లు పనిచేయకపోయినా ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారని బాలలత గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ పదవికి రాజీ నామా చేసి తనతోపాటే మళ్లీ సివిల్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయమై మిగిలిన బ్యూరో క్రాట్లు, ప్రతిపక్ష పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా కూడా స్పందించాలని కోరారు.కాగా, స్మిత వ్యాఖ్యలు దేశంలోని 4 శాతం దివ్యాంగుల మనోభా వాలు దెబ్బతీసేలా ఉన్నాయని అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యా ంగాన్ని అమలు చేయాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పీవోడబ్ల్యూ సంధ్య వ్యాఖ్యా నించారు. మరోవైపు స్మితా సబర్వాల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోనీ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.వరుస ఫిర్యాదులుసీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా మరికొందరు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీ టీ)కు ఫిర్యాదు చేశారు. మరోవైపు శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజిని ఛత్రినాక పోలీస్స్టేషన్లో స్మితపై కంప్లయింట్ ఇచ్చారు. అలాగే చదువుకోని వారంతా వికలాంగులతో సమానం అంటూ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఆయనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఐఏఎస్లు ఎందరు?: మురళిఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై ‘ఎక్స్’ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి అహంకారపూరిత, రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు మన విధాన రూపకర్తలని మండిప డ్డారు. ‘దివ్యాంగుల చట్టం–1995 చట్టం ప్రకారమే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వచ్చా యని ఆవిడకు తెలియదా లేక పార్లమెంటు నే కించపరిచేలా గర్వం తలకెక్కిందా?’ అని దుయ్యబట్టారు. కలెక్టర్లు, జేసీలుగా పని చేస్తున్నప్పుడు మినహా అసలు ఎంత మంది ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరు గుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అండతో దేశంలోనే హెలికాప్టర్లలో తిరిగిన ఏకైక ఐఏఎస్ అధికారి కదా.. ఆ మాత్రం తల బిరుసు ఉంటుందేమోనని విమర్శించారు. -
ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం
సాక్షి, నాగర్కర్నూల్: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. వైన్షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
TG: రేపు అసెంబ్లీకి కేసీఆర్ !
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవనున్నారు. మంగళవారం(జులై 23)నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లడతారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తనున్న అంశాలు ఇవే..నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలుజాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండరాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యంచేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిఆరు గ్యారంటీల అమలు ..శాసన సభలో చట్టబద్దతరైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగంపంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యంరైతుభరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులుగ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం -పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యంఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు
Related News by category
-
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్ఫారమ్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
కారుపై కన్వర్ యాత్రికుల దాడి
లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు. కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద, నిఫ్టీ 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద ముగిశాయి.గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు భావించిందే.. నిజమని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. జాబ్ మార్కెట్పై కృత్రిమ మేధస్సు (AI) ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచుతుంది. అయితే ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి రంగంలోనూ పెను మార్పులను తీసుకువస్తుంది. దీంతో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది.ఏఐ ప్రభావం ఒక్క భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. పని వేగవంతం కావడమే మాత్రమే కాకుండా.. అధిక ఉత్పత్తి ఏఐ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి.కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి వాటిలో కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఈ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పలు విషయాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే ఏఐ యుగంలో కూడా మనగలగవచ్చు.
Advertisement