![ఫార్మా ఆటోమేషన్ @రూ.290 కోట్లు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/3/41434049979_625x300.jpg.webp?itok=dc_s_B6I)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా రంగంలో ఆటోమేషన్ వ్యాపార అవకాశాల పరిమాణం సుమారు రూ.290 కోట్లు ఉంటుందని ష్నీడర్ ఎలక్ట్రిక్ తెలిపింది. 2020 నాటికి ఇది రెండింతలవుతుందని కంపెనీ లైఫ్సెన్సైస్ సొల్యూషన్స్ డెరైక్టర్ రాకేశ్ ముఖీజా గురువారమిక్కడ తెలిపారు. యాంత్రికీకరణ (ఆటోమేషన్) వ్యవస్థ కారణంగా విద్యుత్కు అయ్యే వ్యయం 25-30 శాతం దాకా తగ్గుతుందని చెప్పారు.