![రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/3/81444040452_625x300.jpg.webp?itok=IZtVfoGe)
విశాఖపట్నం: డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఇచ్చే అవార్డు గ్రహీతల పేర్లను ఏపీ ఉన్నత విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో వెల్లండించారు. ఈ నెల 12న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు(ప్రముఖ ప్రవచనకర్త), డాక్టర్ కైకాల సత్యనారాయణ(సినీనటుడు), డాక్టర్ అంపశయ్య నవీన్(నవలా రచయిత), డాక్టర్ సి.మృణాళిని( ప్రొఫెసర్ అండ్ డెరైక్టర్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లు ఈ అవార్డులను అందుకోనున్నారు.