![ఉప్పాడ బీచ్లో వలకు చిక్కిన జారుమెను](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/51427709560_625x300.jpg.webp?itok=sDHS-y8L)
తూర్పుగోదావరి: కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంటపండింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే జారుమెను జాతికి చెందిన చేప వలకు చిక్కింది. దీంతో దానిని బోటుకు కట్టుకుని తీరానికి లాక్కొచ్చారు. దానిని చూడటానికి స్థానికులు గుమిగూడుతున్నారు.